తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు వచ్చిన హీరోయిన్స్ రెండు మూడు సినిమాల తర్వాత కానీ కాస్తో కూస్తో పేరు తెచ్చుకోలేక పోయారు.  కానీ తీసింది ఒకే ఒక్క సినిమా..క్రేజ్ మాత్రం పది సినిమాలకు వచ్చినంత వచ్చింది.  ఇంతకీ ఈ అదృష్టవంతురాలు ఎవరా అని అనుకుంటున్నారా..! సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘అర్జున్ రెడ్డి’ చిత్రంలో హీరోయిన్ గా నటించిన షాలిని పాండె.  ఈ చిత్రం తర్వాత అమ్మడికి ఎక్కడ లేని క్రేజ్ రావడమే కాదు తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లో మంచి ఆఫర్లు కూడా వస్తున్నాయి.  
Image result for arjun reddy posters
తాజాగా షాలిని పాండేకి తీవ్ర అస్వస్థతో ఆసుపత్రిలో చేరింది.  వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరులో  ఓ మొబైల్ షోరూమ్ ఓపెనింగ్ కోసం వెళ్లింది షాలిని.  షెడ్యూల్ ప్రకారం ఉదయం 10 గంటలకు షాపు ఓపెనింగ్ లోకి పాల్గొన్నది. ఆ తర్వాత లైవ్ మ్యూజిక్ పేరుతో చిన్న కార్యక్రమం నిర్వహిస్తున్నారు.  
Related image
ఇదే సమయంలో షాలినికి ఒక్కసారే జ్వరం, తీవ్రమైన తలనొప్పి కారణంగా షోరూములో సొమ్మసిల్లి పడిపోయింది.  వెంటనే తేరుకున్న షాపు యాజమాన్యం బొల్లినేని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో స్ట్రైచర్ పై తీసుకెళ్లే సమయంలో శరీరంపై తెల్లటి వస్త్రం కప్పి ఉంచారు.  
Image result for arjun reddy posters
కొంతసేపు ఐసీయూలో ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం ఆమె కోలుకున్నారని అబ్జర్వేషన్ తర్వాత డిశ్చార్జ్ చేశారు డాక్టర్లు. అయితే షాలిని  వస్తున్నారని తెలిసి భారీ సంఖ్యలో అభిమానులు పెద్ద సంఖ్యలో షాపు వద్దకు వచ్చారని, అభిమానుల తాకిడికి తోడు ఎండ అధికంగా ఉండటం కూడా ఆమె అస్వస్థతకు కారణమని తెలుస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: