యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ బాబి కాంబినేషన్ లో వస్తున్న సినిమా జై లవ కుశ. ఈ నెల 21న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఈ ఇయర్ రాబోతున్న ప్రెస్టిజియస్ ప్రాజెక్టులలో ఒకటని చెప్పొచ్చు. తారక్ మూడు పాత్రల్లో నటిస్తున్న సినిమా రేంజ్ ఏంటన్నది టీజర్, ట్రైలర్ లలో తెలుస్తూనే ఉంది. ఇక ఈ సినిమా ఈరోజు సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.


సెన్సార్ నుండి జై లవ కుశకు పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. 155 నిమిషాల నిడివి కలిగిన ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ మూడు పాత్రల్లో ఒక్కో పాత్రకు మరో పాత్రకి సంబంధం లేకుండా దుమ్ముదులిపేశాడట. ముందుగా అనుకున్నట్టుగానే జై లవ కుశ ఎన్.టి.ఆర్ నట విశ్వరూపం చూస్తారని అంటున్నారు. ఇక మొదటి భాగం మొత్తం ఎంటర్టైనింగ్ గా తీసుకెళ్లి సెకండ్ హాఫ్ ఎమోషన్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందించారట.


సెన్సార్ సభ్యులు ఈ సినిమాకు యు/ఏ సర్టిఫికెట్ అందించారు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగా ఉన్నాయని చెప్పారట. సినిమా మొత్తం ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ లాంటి సినిమా అని అంటున్నారు. మొత్తానికి అనుకున్న విధంగానే సెన్సార్ నుండి పాజిటివ్ రివ్యూ అందుకుని జై లవ కుశ. 



మరింత సమాచారం తెలుసుకోండి: