ఈ మద్య తెలుగు బుల్లితెరపై స్టార్ హీరోల సందడి బాగా పెరిగిపోయింది. అక్కినేని నాగార్జున, మెగాస్టార్ చిరంజీవి ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కార్యక్రమంతో తెగ సందడి చేశారు. ఆ తర్వాత ప్రపంచంలో పాపులర్ అయిన ‘బిగ్ బాస్ ’ షో తెలుగు లో ఎన్టీఆర్ హోస్ట్ గా నిర్వహిస్తున్నారు. ఇక బాహుబలి సీరీస్ తో పాపులర్ అయిన రానా ‘యారి’ షో సందడి చేస్తున్నారు. ఇక బిగ్ బాస్ కార్యక్రమలో సినిమా స్టార్లు సందడి చేస్తున్నారు. ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా ప్రమోషన్ కోసం రానా వచ్చారు.
‘ఆనందో బ్రహ్మ’ చిత్రం కోసం తాప్సీ, మేడ మీద అబ్బాయి కోసం అల్లరి నరేష్, ఉంగరాల రాంబాబు చిత్రం కోసం సునీల్, వీడెవడు చిత్రం కోసం సచిన్ ఇలా ఒక్కొక్కరూ తెగ సందడి చేశారు. అయితే రానా హోస్ట్ గా 'నెంబర్ వన్ యారి' షో ని జెమినీ ఛానల్ వారు మొదలు పెట్టిన విషయం తెలిసిందే. ఈ ప్రోగ్రామ్ లో కూడా హీరోలు తమ ప్రమోషన్ కోసం వస్తున్నారు.
ఇలా బుల్లితెరపై బిగ్ బాస్, నెంబర్ వన్ యారీ ప్రోగ్రామ్ లో పోటీ నెలకొంది. తాజాగా ఈనెల మూడున టెలికాస్ట్ అయిన రానా ‘యారి’ షో రేటింగ్ మరోసారి అదుర్స్ అనిపించింది. బాలకృష్ణ గెస్ట్గా వచ్చిన ఈ ఎపిసోడ్కు 12.52తో టాప్ రేటింగ్ దక్కింది. బిగ్బాస్ తారక్ ఎపిసోడ్స్ మరింత తగ్గి 4.7కి పరిమితమైంది. నందమూరి బాలకృష్ణ 101 వ చిత్రం ‘పైసా వసూల్’ చిత్రం ప్రమోషన్ లో భాగంగా నెంబర్ వన్ యారీ ప్రోగ్రామ్ చేసిన అల్లరి తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.
జెమినీ టెలికాస్ట్ చేసిన సైమా అవార్డ్స్ 12 రేటింగ్ తెచ్చుకొని 651 పాయింట్స్తో టాప్ వ్యూయర్ షిప్ఛానల్గా నిల్చింది. దీంతో బిబ్ బాస్ వీక్లీ ఎపిసోడ్స్ 3.9కు డౌన్ అయ్యాయి. స్టార్ మా ఈవారం 599 పాయింట్స్తో సెకండ్ ప్లేస్తో సరిపెట్టుకుంది. బాలకృష్ణ ‘పైసా వసూల్’ హిట్ టాక్ తెచ్చుకోక పోయినా..బుల్లితెరపై చేసిన సందడి సూపర్హిట్ అయ్యింది. మొత్తానికి బాబాయ్ ఇచ్చిన షాక్ కి అబ్బాయి కాసింత వీక్ అయ్యాడనే అంటున్నారు.