తెలుగు ఇండస్ట్రీలో హీరోల వారసులు ఎంట్రీ ఇస్తున్న ఈ సమయంలో స్టార్ ప్రొడ్యూసర్ డి.సురేష్ బాబు తనయుడు రానా ‘లీడర్’ చిత్రంలో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అయితే హీరోగా ఇప్పటి వరకు పలు చిత్రాల్లో నటించినా రానా కు పెద్దగా గుర్తింపు రాలేదు. ఇక ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ప్రతిష్టాత్మక చిత్రం బాహుబలి సిరీస్ లో ప్రతినాయకుడుగా రానా కి జాతీయ స్థాయిలో మంచి పేరు..గుర్తింపు వచ్చింది.
ఈ మద్య తేజ దర్శకత్వంలో ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రం సూపర్ డూపర్ హిట్ కొట్టాడు. అంతకు ముందు ఘాజీ సినిమాతో మరోసారి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం బుల్లితెరపై నెంబర్ వన్ యారీ కార్యక్రమంలో హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. అయితే రానా మొదటి నుంచి సినిమా క్యారెక్టర్లపైనే దృష్టిపెడుతూ..తెలుగు, తమిళ, హిందీ ఇండస్ట్రీలో తనకంటూ మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు.
తాజాగా రానాకి మరో అదృష్టం వచింది. త్వరలో ఒక హాలీవుడ్ మూవీ చేయనున్నారు.. ఈ సినిమాకి 'విజిల్' అనే టైటిల్ ను ఖరారు చేశారు. వాస్తవ సంఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది. ఇక చిత్రం విషయానికి వస్తే..1888వ సంవత్సరంలో 700 మంది ప్రయాణికులతో ఓ భారీ ఓడ సౌరాష్ట్ర నుంచి బయలుదేరింది.
అలా బయలుదేరిన కొన్ని రోజులకు అది అదృశ్యమైంది. ఆ ఓడ ఏమైంది? దాని అదృశ్యానికి గల కారణాలేంటనే విషయాలపై పరిశోధన చేసే సైంటిస్ట్ పాత్రలో రానా కనిపించనున్నాడు. మొత్తానికి తెలుగు, తమిళ, హిందీ భాషలతో పాటు రానా హాలీవుడ్ లో కూడా కనిపించడంపై అభిమానులు తెగ సంతోషంలో ఉన్నారు. ఈ సినిమా త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుంది.