తెలుగు బుల్లితెరపై ఇప్పటి వరకు ఎన్నో రియాల్టీ షోలు వచ్చాయి. మొట్టమొదటి సారిగా ప్రపంచంలో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న బిగ్ బాస్ షో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హెస్ట్ గా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. డైబ్బై రోజులు, 14 మంది సభ్యులు, 60 కెమెరాలు బయటి వారితో ఎలాంటి సంబంధాలు లేకుండా ఒకే ఇంట్లో గడపడపడమే ఈ బిగ్ బాస్ షో. ఇలా ఇప్పటికే 60 రోజులు గడిచిపోయాయి.. బిగ్ బాస్ హౌజ్ నుంచి ఇప్పటి వరకు జ్యోతి, మధు ప్రియ,సమీర్, కత్తి మహేష్, కల్పన,ధన్ రాజ్, కత్తి కార్తీక, ముమైత్ ఖాన్, ప్రిన్స్, ఎలిమినేట్ అయ్యారు.
ఇక సంపూర్ణేష్ బాబు అనూహ్యంగా కెప్టెన్సీ దక్కించుకున్నారు. కానీ ఒంటరితనాన్ని భరించలేక బిగ్ బాస్ హౌజ్ నుంచి మద్యలోనే వెళ్లిపోయాడు. సంపూ స్థానంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ తో అందాల భామ దీక్షా పంత్, హీరో నవదీప్ లు ఎంట్రీ ఇచ్చారు. గత కొన్ని రోజుల నుంచి బిగ్ బాస్ హౌజ్ లో తారల సందడి నెలకొంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రానా, తాప్సీ, అల్లరి నరేష్, సచిన్ లతో పాటు ఉంగరాల రాంబాబు చిత్రం ప్రమోషన్ కోసం కామెడీ హీరో సునీల్ కూడా హల్ చల్ చేశారు.
బిగ్ బాస్ సోమవారం నుంచి శుక్రవారం వరకు ఎలా ఉన్నా..శని, ఆదివారాలు వచ్చాయంటే ఎన్టీఆర్ చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. తాను ఇచ్చే టాస్క్ లు, ఇంటి సభ్యులు చేస్తున్న చిలిపి పనులు బాహాటంగా విమర్శించడం..చూపించడం చేస్తూ మంచి ఎంట్రటైన్ మెంట్ అందిస్తున్నారు. ఇప్పటికే బిగ్ బాస్ షో 60 రోజులు గడిచిపోయింది..ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ శనివారం బిగ్ బాస్ హౌజ్ లో భలే సందడి చేశాడు.
ప్రస్తుతం బిగ్ బాస్ హౌజ్ లో హరితేజ, శివబాలాజి, ఆదర్శ్, అర్చన,నవదీప్ లు ఉండగా నిన్న దీక్షపంత్ ఎలిమినేట్ అయ్యారు. ఇక శనివారం ఎన్టీఆర్ బిగ్ బాస్ హౌజ్ లోకి వెళ్లి హరితేజకు టమాటా పచ్చడి, మిగిలిన సభ్యులకు మటన్ పలావ్ స్వయంగా తానే వండి వడ్డించాడు.
ఈ వంట చేస్తున్న సమయంలో ఒకరిపై ఒకరి అభిప్రాయాలు అడుగుతూ..షేర్ చేస్తూ బిగ్ బాస్ హౌజ్ లో సంతోషాలు పంచారు ఎన్టీఆర్. మొత్తానికి ఎన్టీఆర్ నటన పరంగానే కాకుండా పాక శాస్త్రంలో కూడా నలభీముడికి ఏమీ తక్కువ కాదన్నట్టుగా మటన్ పలావ్ వండటం ప్రేక్షకులకు మంచి కనువిందు చేసింది.