ఈ సినిమా ఫస్ట్ లుక్ చూడగానే `విషయం ఉన్న సినిమా` అనిపించింది. అంతేకాదు.. సిరివెన్నెల సీతారామశాస్త్రి ఇందులో ఓ భావోద్వేగమైన గీతం రచించారు. అది కూడా.. ఈ సినిమాపై అంచనాలు పెంచింది. ట్రైలర్లో చూపిస్తున్నటేకింగ్, పోస్టర్లు కాస్త మెస్మరైజ్ చేశాయి. దాంతో అందరి దృష్టీ ఈ సినిమాపై పడింది.
కానీ సినిమా పూర్తయినా ఇన్నాళ్లూ విడుదల కాలేదు. ఇప్పుడు ఈ సినిమాకి మోక్షం లభించింది. ఈ సినిమాని స్వాతంత్య్ర దినోత్సవం రోజున అంటే ఆగస్టు 15న విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేసుకొంటున్నారు. అంటే దేశానికి పాటు దశానికీ స్వాతంత్ర్యం వచ్చిందన్నమాట.