తెలుగు  ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాన్ అక్కడ అమ్మాయి..ఇక్కడ అబ్బాయి చిత్రంతో ఎంట్రీ ఇచ్చాడు.  ఆ సినిమా పెద్ద సక్సెస్ కాలేక పోయింది.  తర్వాత తమ్ముడు, సుస్వాగతం, తొలి ప్రేమ లాంటి సినిమాలతో హీరోగా కాస్త గుర్తింపు తెచ్చుకుంటున్న సమయంలో ‘ఖుషి’ చిత్రంతో ఒక్కసారే స్టార్ ఇమేజ్ పెరిగిపోయింది.   ఖుషి చిత్రంలో పవన్ కళ్యాన్ నటనకు తెలుగు అభిమానులు ఫిదా అయ్యారు.  ఫైట్స్, కామెడీ, రొమాన్స్ అన్నింటిలోనూ తనదైన స్టైల్ కనబరిచారు పవన్.  
Image result for kushi movie
అయితే ఇంత అద్భుతమైన హిట్ సినిమా అందించి ఎవరో కాదు తమిళ నటుడు, దర్శకుడు ఎస్. జె. సూర్య.   తమిళ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్న ఎస్. జె. సూర్య హీరోగా నటిస్తూనే దర్శకత్వం వైపు మొగ్గు చూపారు.  తెలుగులో మొదటి సారిగా పవన్ కళ్యాన్, భూమిక తో ‘ఖుషి’ చిత్రాన్ని తెరకెక్కించి మంచి సక్సెస్ సాధించాడు.  
Related image
ఇదే కాంబినేషన్ లో వచ్చిన ‘కొమరం పులి’ మాత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది.  తాజాగా సూర్య తమిళ స్టార్ దర్శకులు మురుగదాస్, మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న ‘స్పైడర్’ చిత్రంలో విలన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సూర్య మాట్లాడుతూ..ఇప్పటికే పలు సూపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించానని , కాబట్టి కొత్తగా నన్ను నేను డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకోవాల్సింది ఏమి లేదని అందుకే ఇకపై డైరెక్షన్ చేయనని కేవలం యాక్టింగ్ మాత్రమే చేస్తానని అంటున్నాడు.  
Image result for mahesh spyder surya
గతంలో మహేష్ బాబు తో ‘నాని’ లాంటి ప్రయోగాత్మక చిత్రం తెరకెక్కించారు...ఇదే చిత్రాన్ని తమిళంలో హీరోగా కూడా నటించాడు సూర్య.  తాజాగా తెరకెక్కించిన ‘స్పైడర్’ చిత్రంలో విలన్ పాత్ర తనకు ఎంతో పేరు తెస్తుందని..ఆ పాత్ర కోసం తాను ఎంతో కష్టపడ్డానని అంటున్నారు.  మహేష్ తో సినిమా అనగానే ప్రతినాయకుడి తాను ఇష్టపడి నటించానని అన్నాడు.
Image result for mahesh spyder surya
ఇకపై దర్శకత్వం జోలికి పోనని , పూర్తిగా యాక్టింగ్ మీదే దృష్టి పెడతానని అంటున్నాడు. అంతేకాదు అసలు నేను ఇక్కడికి వచ్చింది యాక్టింగ్ చేయడానికే కానీ మధ్యలో డైరెక్షన్ చేయాల్సి వచ్చిందని అంటున్నాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: