చిరంజీవి బాలకృష్ణలు కలిసి నటిస్తే చూడాలని ఎంతోమంది కోరుకున్నా అది ఎప్పుడు నెరవేరని కలగానే మిగిలిపోయింది. దీనికితోడు వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం కూడ అంతంత మాత్రమే అవ్వడంతో చిరంజీవి బాలకృష్ణలు కలిసి కెమెరాలకు పోజులు ఇచ్చిన సందర్భాలు చాల తక్కువ. 

అయితే ఆలోటును చరణ్ తీరుస్తున్నాడు. టాప్ హీరోలు అంతా ఒక్కటే అన్న సందేశాన్ని అందరికీ ఇస్తూ దసరా రోజున మెగా నందమూరి అభిమానులకు ఒక షాక్ ఇచ్చాడు. చరణ్ ‘జై లవ కుశ’ సినిమాను చూసి జూనియర్ ని అభినందించినట్లు వార్తలు వస్తున్నాయి. 

అంతేకాదు చరణ్ ఎన్టీఆర్‌ కలసి ఒక సెల్ఫీ ఫోటోను కూడ తీసుకుని తమ అభిమానులకు షేర్ చేసాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాకు హాట్ టాపిక్ గా మారడంతో ఈ ఫోటోను మెగా నందమూరి అభిమానులు తెగ ఎంజాయ్ చేస్తూ చూడటమే కాకుండా విపరీతంగా లైకులు కొడుతున్నారు. 

టాప్ హీరోల రికార్డ్ ల గురించి నానా రభసా చేస్తూ అభిమానులు గందరగోళం సృష్టిస్తున్న ప్రస్తుత పరిస్థుతులలో తాము అంతా ఒకటే అన్న సంకేతాన్ని తమ అభిమానులకు ఇస్తూ చరణ్ వేసిన ఈ ముందడుగు చాల మంచి పరిణామం అంటూ ఇండస్ట్రీ వర్గాలలో కామెంట్స్ కూడ వినిపిస్తున్నాయి. 

హీరోల ఫ్లక్సీల గురించి వారివారి అభిమానులు ఘర్షణ పడుతూ అనేక సంఘటనలు జరుగుతున్న ప్రస్తుత పరిస్థుతులలో చరణ్ జూనియర్ లు వేసిన ఈ ఎత్తుగడ తాము అంతా ఒక్కటే అన్న సందేశాన్ని ఇస్తోంది. ఇప్పటికే రెండవ వారంలోకి అడుగు పెట్టిన ‘జై లవ కుశ’ కు మెగా అభిమానుల మద్దతు చరణ్ వ్యూహాలు వల్లలభిస్తే అది జూనియర్ కోరుకున్న రికార్డులను దగ్గరకు చేరుస్తుంది అనడంలో సందేహం లేదు..   


మరింత సమాచారం తెలుసుకోండి: