తెలుగు, తమిళ, హిందీ ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతాలు సృష్టించి.. తెలుగు చలన చిత్ర చరిత్రలో ఎన్నో సంచలనాలకు కేంద్ర బింధువుగా నిలిచిన చిత్రం బాహుబలి, బాహుబలి 2. ఎస్ ఎస్ రాజమౌళి ఐదు సంవత్సరాలు సుదీర్ఘంగా కష్టపడి తెరకెక్కించిన ప్రతిష్టాత్మక చిత్రాలు బాహుబలి, బాహుబలి 2. ఇప్పటి వరకు ఎన్నో జానపద చిత్రాలు వచ్చినా..ప్యూజువల్ వండర్ గా తెరకెక్కిన చిత్రం బాహుబలి సీరీస్. ఇక బాహుబలి చిత్రానికి జాతీయ ఉత్తమ చిత్రం అవార్డు వచ్చింది.
బాహుబలి 2 చిత్రంతో భారత దేశంలో అత్యధిక వసూళ్లు చేసిన చిత్రంగా రికార్డులు సృష్టించింది. ఈ చిత్రంలో నటించిన ప్రభాస్, రానా, అనుష్క, రమ్యకృష్ణ, సత్యరాజ్ లకు ఎంతో గొప్ప పేరు రావడమే కాదు జాతీయ స్థాయి నటులుగా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం బాహుబలి దర్శకుడు రాజమౌళి ఒక్కరు తప్ప ఇందులో నటులు అంతా ఇతర సినిమాల్లో బిజీగా ఉన్నారు.
తాజాగా బాలీవుడ్ ఒకప్పటి హాట్ బ్యూటీ రవీనాటాండన్ ‘బాహుబలి’ టీమ్ తో కలిసి పార్టీ చేసుకున్నట్లు తెలిపింది. ‘నిన్న రాత్రి పార్టీ గురించి.. హైదరాబాద్ స్టైల్ లో పార్టీ చేసుకున్నాం. ఫన్, ఫుడ్, ఫ్రెండ్స్.. ’ తెలిపింది. హీరో ప్రభాస్, నటుడు రానా, నటీమణులు అనుష్క మొదలైన వ్యక్తులతో కలిసి ఈ పార్టీ చేసుకున్నట్టు తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో రవీనా టాండన్ పేర్కొంది. దీనికి సంబంధించిన ఓ ఫోటో పోస్ట్ కూడా పోస్ట్ చేసింది రవీనాటాండన్.