టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ మురుగదాస్ కాంబినేషన్ లో వచ్చిన స్పైడర్ ప్రస్తుతం థియేటర్స్ లో సందడి చేస్తుండగా ఆ తర్వాత కొరటాల శివతో చేస్తున్న భరత్ అను నేను షూటింగ్ జరుగుతూనే ఉంది. శ్రీమంతుడు తర్వాత శివ, మహేష్ కలిసి పనిచేస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.


డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా కైరా అద్వాని నటిస్తుంది. ఇక ఈ సినిమా పూర్తి కాకుండానే మహేష్ వంశీ పైడిపల్లితో మరో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. అశ్వనిదత్, దిల్ రాజు కలిసి నిర్మించే ఆ సినిమా 2018 మార్చిలో మొదలు కాబోతుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్దెని అనుకోగా ఎందుకో ఆమె ప్లేస్ లో రకుల్ నే తీసుకునే ఆలోచనలో ఉన్నారట చిత్రయూనిట్.


పూజా హెగ్దె పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ సినిమాలు ఇంకా టాలెంట్ చూపించలేదు. రకుల్ విషయానికి వస్తే తన టాలెంట్ తోనే స్టార్ రేంజ్ కు వచ్చింది. వంశీ పైడిపల్లి సినిమాలో హీరోయిన్ కు ఇంపార్టెంట్ రోల్ ఉందట. అందుకే పూజా దాన్ని బేర్ చేయగలుగుతుందో లేదో అన్న కారణంతో మళ్లీ రకుల్ కే ఛాన్స్ ఇచ్చారు. 


మహేష్ తో స్పైడర్ చేసిన అనుభవంతో రకుల్ కూడా మళ్లీ మహేష్ తో చేసేందుకు సై అంటుంది. మహేష్ లాంటి కో యాక్టర్ తో ఎన్ని సినిమాలు చేసినా విసుగు ఉండదు అన్న భావనలో ఉందట రకుల్. మహేష్ లాంటి అందగాడి పక్కన హీరోయిన్ గా మళ్లీ మళ్లీ రకుల్ కు రావడం గొప్ప విషయమే మరి స్పైడర్ నిరాశ పరచినా మహేష్ రకుల్ పెయిర్ ఈ సినిమాతో అయినా హిట్ అందుకుంటుందేమో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: