తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించిన స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కి  స్పైడర్ చిత్రం భారీ నష్టాలను తెచ్చిపెడుతోంది.   తమిళ స్టార్ దర్శకులు, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన ‘స్పైడర్’ చిత్రంపై మొదటి నుంచి ఎన్నో అంచనాలు పెరిగిపోయాయి.  ఈ సినిమాలో నటుడు, దర్శకుడు సూర్య మొదటి సారిగా విలన్ గా నటిస్తున్నారు.  దీంతో సినిమా చాలా థ్రిల్లింగ్ గా ఉంటుందని..సైంటిఫిక్ గా ఉంటుందని భావించారు. 
Image result for mahesh babu spyder
వాస్తవానికి మురుగదాస్ నేటి సమాజంలో జరుగుతున్న సైబర్ క్రైమ్ ఎంతగా ప్రబలిపోతుందీ..దాని వల్ల జరుగుతున్న నష్టాలు ఎంతో ఘోరంగా ఉన్నాయి అన్న విషయం పై చెప్పారు.  కాకపోతే టెక్నాలజీ పరంగా మైండ్ గేమ్ తో సాగిన ఈ చిత్రం మాస్ ఆడియన్స్ ని పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. థియేటర్లో  రిలీజ్ అయిన రోజు నుంచి సినిమాపై మిశ్రమ స్పందన వచ్చింది.  ఇక ఈ సినిమా పై రివ్యూలు కూడా పెద్దగా పేలలేదు. దీంతో సినిమా మొదటి నుంచి కలెక్షన్ల పరంగా డల్ గా నడుస్తుంది. 
Image result for mahesh babu spyder
దాదాపుగా స్పైడర్ సినిమా రిలీజ్ అయి వారం కావస్తోంది , కానీ తెలంగాణ లో  వసూల్ అయ్యింది కేవలం 12 కోట్లు మాత్రమే ! కానీ ఈ సినిమాని పొటీ పడి మరీ 25 కోట్లకు కొన్నాడు దిల్ రాజు.   ఈ రోజు ఎలాంటి సినిమాలు రిలీజ్ కావడం లేదు..మరి ఈ వారం కనీసం ఐదు కోట్లు వచ్చినా   పది కోట్లకు పైగా నష్టం వస్తోంది దిల్ రాజు కు .
Image result for mahesh babu spyder
నైజాం లో కొన్ని థియేటర్ లు దిల్ రాజు చేతిలో ఉన్నాయి కాబట్టి వాటి లెక్కలు పక్కన పెట్టినా కూడా స్పైడర్ వల్ల దిల్ రాజు కి పెద్దగా లాభాలు లేవు.  కాకపోతే నైజాం లో ఎన్టీఆర్ నటించిన జై లవకుశ చిత్రాన్ని కూడా దిల్ రాజే కొన్నాడు ఆ సినిమా వల్ల పెద్దగా నష్టాలు మాత్రం రాలేదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: