తెలుగు ఇండస్ట్రీలో టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతాగ్యారేజ్ తర్వాత ‘జై లవ కుశ’ చిత్రంతో వరుస బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టిన జూనియర్ ఎన్టీఆర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..తాత ఎన్టీఆర్ బయోపిక్పై ఆసక్తిర విషయాలను వెల్లడించారు. బాబీ దర్శకత్వంలో ‘జై లవ కుశ’ చిత్రం అభిమానులు ఎంతగానో ఆదరించారని..ముఖ్యంగా జై నామస్మరణతో థియేటర్స్ మారుమ్రోగుతుండగా అభిమానులు జే..జే..లు పలుకుతున్నారు.
ఇది తనకు ఎంతగానో సంతృప్తిని ఇచ్చిందని అన్నారు. ఇక తాత జీవిత చరిత్రను ఎవరు తీసినా స్వాగతిస్తానని …ఆ సినిమాలో నటించడం ఆషామాషి విషయం కాదన్నారు. ఈ సినిమాలో మీరు నటిస్తారా అనే ప్రశ్నకు… ‘తాత పాత్ర చెయ్యలేనని కాదుగానీ..’ అంటూనే ‘ఆ పాత్ర చేయనుగాక చేయను..’ అని చెప్పకనే చెప్పారు.
ఆ మద్య బిగ్ బాస్ ఓపెనింగ్ కార్యక్రమంలో చెప్పినట్లే ఆయన మహా నటుడు,పొలిటికల్ లీడర్, ఆయన ఒక ఫ్యామిలీకి సంబంధించిన వారు కాదని… తెలుగు ప్రజలు అందరి గుండెల్లో దేవుడిగా కొలువుదీరాడని, అలాంటి మహనీయుడి పాత్ర చేయాలంటే గట్స్ కావాలన్నారు.
ఇక ఎన్టీఆర్ బయోపిక్ త్వరలో సినిమా రాబోతుందని బాలయ్య ప్రకటించిన కొద్దిరోజులకే వివాదస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ…లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో సినిమా తీస్తున్నట్లు ప్రక టించారు.
అంతే కాదు దర్శకులు తేజ కూడా ఇందులోకి వచ్చారు..కానీ ఇప్పటి వరకు ఎన్టీర్ బయోస్కోపిక్ పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ నేపథ్యంలో స్పందించిన తారక్…రెండు సినిమాలపై అభ్యంతరం లేదని చెప్పుకొచ్చారు.