తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన ‘స్పైడర్’ అనుకున్న అంచనాలు అందుకోలేక పోయింది. రిలీజ్ అయిన అన్ని కేంద్రాల్లో మిశ్రమ స్పందన రావడంతో కలెక్షన్లు కూడా బాగా తగ్గాయని టాక్ వినిపిస్తుంది. మహేష్ బాబు తన కెరీర్ లో ‘పోకిరి’ తర్వాత అంత గొప్ప రేంజ్ కి తీసుకువెళ్లిన చిత్రం ‘శ్రీమంతుడు’. ఈ చిత్రంతో మహేష్ బాబు తన కెరీర్ లో బెస్ట్ సినిమా అనిపించుకోవడమే కాకుండా కలెక్షన్ల పరంగా కూడా దుమ్మురేపారు.
ప్రముఖ దర్శకులు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ‘శ్రీమంతుడు’ చిత్రం సోషల్ మెస్సేజ్ కి అందరూ ఫిదా అయ్యారు. అంతే కాదు చాలా మంది సెలబ్రెటీలు కూడా కొన్ని గ్రామాలు దత్తత తీసుకున్నారు. ఇక స్పైడర్ చిత్రంపై కాస్త అసహనంగా ఉన్న మహేష్ బాబు..ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో `భరత్ అనే నేను` చిత్రంలో నటిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో మహేష్ ముఖ్యమంత్రిగా కనిపించబోతున్నారట.
ఆ మద్య శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ‘దూకుడు’ చిత్రంలో ఎమ్మెల్యేగా కనిపించిన మహేష్ బాబు ఈసారి `భరత్ అనే నేను` చిత్రంలో సీఎం గా కనిపించబోతున్నాడట. అయితే సమాజంలో రాజకీయ పరిస్థితులు ఎంత దిగజారుతున్నాయో..ఓ యువకుడు సీఎం అయితే దాన్ని ఎలా ప్రక్షాలళ చేశాడో అన్న కాన్సెప్ట్ తో ఈ చిత్రం ఉండబోతుందట.
తాజాగా `భరత్ అనే నేను` ఫస్ట్లుక్ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సినిమాలో మహేశ్ బాబు ముఖ్యమంత్రి పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పాత్రకి తగ్గట్టుగానే మహేశ్ బాబు సీఎంగా నడుస్తున్న లుక్ని చిత్రయూనిట్ పంచుకుంది. పక్కన ఇద్దరు గన్మెన్లతో నడిచొస్తున్న స్టిల్ అభిమానులను ఆకట్టుకుంటోంది.
చిత్రంలో బ్రహ్మాజీ కూడా కనిపిస్తున్నారు. బహుశా ఆయన చీఫ్ సెక్రటరీ పాత్రలో నటిస్తుండవచ్చని అభిమానులు అంచనా వేస్తున్నారు. తన చిత్రాల్లో సోషల్ మెసేజ్ తో మంచి ఎంట్రటైన్ మెంట్ చూపించే కొరటాల శివ ఈ సారి మహేష్ కి మరో సూపర్ హిట్ అందించబోతున్నాడని తెగ సంతోషంలో ఉన్నారు మహేష్ అభిమానులు.