మెగా పవర్ స్టార్ రాం చరణ్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా రంగస్థలం 1985. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తుంది. ఇక సినిమాలో అనసూయ కూడా ఓ స్పెషల్ రోల్ ప్లే చేస్తున్న సంగతి తెలిసిందే. పల్లెటూరి ప్రేమకథ నేపథ్యంతో వస్తున్న ఈ సినిమాలో చరణ్ కొత్త లుక్ తో కనిపిస్తాడని తెలుస్తుంది.


నాన్నకు ప్రేమతో తర్వాత సుకుమార్ చేస్తున్న ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. ముఖ్యంగా తన స్టైలిష్ టేకింగ్ కు దూరంగా స్వచ్చమైన పల్లెటూరు అందాలతో సినిమా తెరకెక్కించడం గొప్ప విషయం. అందుకే సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ కాకుండానే ప్రీ రిలీజ్ బిజినెస్ హంగామా మొదలు పెట్టింది.  


సినిమా ఇప్పటికే నైజా ఏరియాలో భారీ రేటుకి అడుగుతుండగా మిగతా ఏరియాల నుండి కూడా సర్ ప్రైజింగ్ బిజినెస్ ఆఫర్ చేస్తున్నారట. చూస్తుంటే చరణ్ రంగస్థలం 100 కోట్ల పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతుందని అంటున్నారు. ఇక రీమేక్, శాటిలైట్ రైట్స్ కూడా బోనస్సే. 


చరణ్ సుక్కు కాంబినేషన్ పై ఉన్న నమ్మకం సినిమా బిజినెస్ రూపంలో తెలుస్తుంది. అంతేకాదు సినిమాలో పూజా హెగ్దె ఐటం సాంగ్ కూడా ఉంటుందని తెలుస్తుంది. సో ఇన్ని క్రేజీ ఎలిమెంట్స్ ఉన్న ఈ సినిమా బిజినెస్ కు తగ్గ వసూళ్లతో బాక్స్ బద్ధలయ్యేలా చేస్తుందని ఆశించవచ్చు.



మరింత సమాచారం తెలుసుకోండి: