తెలుగు, తమిళ, హిందీ ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి మెప్పించారు సూపర్ స్టార్ రజినీకాంత్. ఇప్పటికీ యంగ్ హీరోలకు పోటీగా తన రేంజ్ ఏమాత్రం తగ్గించుకోకుండా నటిస్తూ..షెభాష్ అనిపించుకుంటున్నారు. ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎన్నో మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రాలు తెరకెక్కించారు నెంబర్ వన్ డైరెక్టర్ శంకర్.
వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమా ‘రోబో’. భారత దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం దుమ్మురేపింది. ఈ చిత్రం తర్వాత అటు శంకర్ ఇటు రజినీకాంత్ కి అస్సలు కలిసి రావడం లేదు. రజనీకాంత్- అక్షయ్కుమార్- అమీజాక్సన్ కాంబినేషన్లో రానున్న ఫిల్మ్ 2.0 మూవీ. ఇప్పటికే ఈ చిత్రంపై విపరీతమైన అంచనాలు పెరిగిపోతున్నాయి.
శంకర్ డైరెక్షన్లో రానున్న ఈ చిత్రాన్ని 2డీ ఫార్మూట్లో కాకుండా 3డీలోనూ రెడీ చేస్తున్నారు. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ ఫిల్మ్ మేకింగ్ వీడియోని తాజాగా రిలీజ్ అయ్యింది. ఈ వీడియో చూస్తుంటే.. ఇప్పటి వరకు భారతీయ చలన చిత్ర రంగంలో కనీ వినీ ఎరుగని రీతిలో..హాలీవుడ్ రేంజ్ లో తీసినట్లు కనిపిస్తుంది.
హై క్వాలిటీ విజువల్స్, త్రీడీ ఎక్స్ పీరియన్స్ మహాద్భుతంగా వచ్చాయనేట్టుగా ఉంది ఈ మేకింగ్ వీడియో. శంకర్, రజనీ, అక్షయ్ కుమార్ మరికొందరు టెక్నీషియన్లు సినిమా నిర్మాణం, విజువలైజేషన్ గురించి ఈ వీడియోలో తమ అనుభవాల్ని పంచుకున్నారు. అంతా అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది 2.0 సినిమా థియేటర్స్కి రానుంది.
ఆడియో పంక్షన్ అక్టోబర్ 27న దుబాయ్లోని బుర్జ్ ఖలీఫా టవర్స్ దగ్గరున్న పార్క్ లో నిర్వహించనున్నారు. అమీ జాక్సన్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాకు ఎఆర్ రహమాన్ సంగీతం అందిస్తున్నారు. రిపబ్లిక్ డే కి ఈ సినిమా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.