ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా కిశోర్ తిరుమల డైరక్షన్ లో వస్తున్న సినిమా ఉన్నది ఒక్కటే జిందగి. నేను శైలజ తర్వాత ఇదే కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. రామ్ లుక్ స్టైలిష్ గా ఉండటమే కాదు సినిమాలోని సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. సినిమాలో ఇప్పటికే ఫ్రెండ్ షిప్ మీద సాంగ్ రిలీజ్ చేయగా ఇప్పుడు సెకండ్ సాంగ్ వాట్ అమ్మా అంటూ సాంగ్ వచ్చింది. 


దేవి శ్రీ ప్రసాద్ పాడిన ఈ సాంగ్ శ్రీమణి రచించడం జరిగింది. కొన్నాళ్లుగా రొటీన్ సినిమాలు తీస్తూ విమర్శలు ఎదుర్కున్న రాం నేను శైలజతో హిట్ ట్రాక్ ఎక్కాడని అనుకున్నారు కాని మళ్లీ ఆ తర్వాత హైపర్ సినిమా మళ్లీ రొటీన్ రచ్చగానే తీసుకొచ్చాడు. తనలోని ఎనర్జీని సరిగా వాడుకుంటే మంచి ఫలితాలు వస్తాయని తెలిసినా రామ్ అప్పుడప్పుడు మిస్టేక్స్ చేస్తుంటాడు. 


ఇక మళ్లీ తన సత్తా చాటేందుకు ఉన్నది ఒక్కటే జిందగి సినిమా ద్వారా వస్తున్నాడు రామ్. సినిమా నుండి రిలీజ్ అవుతున్న రామ్ ఫోటోలు ఆకట్టుకోగా సినిమా నేను శైలజలానే మ్యూజికల్ హిట్ అవుతుందని అంటున్నారు. అక్టోబర్ 27న రిలీజ్ అవనున్న ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్, లావణ్య త్రిపాఠి హీరోయిన్స్ గా నటిస్తున్నారు.    


ప్రస్తుతం యువ హీరోలంతా కొత్త కథలతో సూపర్ హిట్ కొడుతుండటంతో యువ హీరోల మధ్య కూడా రసవత్తరమైన పోటీ కొనసాగుతుంది. ఒకటి రెండు సినిమాలు వరుసగా ఫ్లాప్ అయితే ప్రేక్షకులు కూడా పట్టించుకోవడం మానేస్తున్నారు అందుకే యువ హీరోలు కూడా సినిమా సినిమాకు కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: