వరుణ్ తేజ్, సాయి పల్లవి కలిసి నటించిన ఫిదా సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టించిందో తెలిసిందే. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా 50 కోట్ల గ్రాస్ కలక్షన్స్ తో దుమ్ముదులిపేసింది. శేఖర్ కమ్ముల డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాను దిల్ రాజు నిర్మించారు. సాయి పల్లవి అభినయానికి అందరు ఫిదా అయ్యారు.


మెగా బ్రదర్ నాగబాబు తనయుడిగా తెరంగేట్రం చేసిన వరుణ్ తేజ్ సినిమాలైతే చేస్తున్నాడు కాని కమర్షియల్ గా మాత్రం సక్సెస్ అందుకోలేదు. అయితే ఫిదాతో మొదటి కమర్షియల్ హిట్ అందుకోవడమే కాదు రికార్డులు సృష్టించాడు. సినిమా కేవలం వెండితెర మీదే కాదు బుల్లితెర మీద కూడా సంచలనాలు సృష్టించింది.


స్టార్ మాలో పండుగ సందర్భంగా బుల్లితెర మీద సందడి చేసిన ఫిదా మూవీ అత్యధికంగా 21.3 టి.ఆర్.పి రేటిగ్స్ తెచ్చుకుంది. స్టార్ సినిమాలకు సైతం షాక్ ఇచ్చే టి.ఆర్.పి రేటింగ్ తో అదరగొట్టాడు వరుణ్ తేజ్. బాహుబలి సినిమాలకు సమానమైన రేటింగ్స్ సంపాదించడమే కాదు జనతా గ్యారేజ్, శ్రీమంతుడు సినిమాల టి.ఆర్.పి రేటింగ్స్ ను క్రాస్ చేసింది ఫిదా.


సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో టి.ఆర్.పి రేటింగ్స్ చూసి కూడా చెప్పొచ్చు. శేఖర్ కమ్ముల మార్క్ సినిమాగా వచ్చిన ఈ ఫిదాతో మళ్లీ దర్శకుడు హిట్ ట్రాక్ ఎక్కాడు. వరుణ్ తేజ్ కూడా ప్రస్తుతం వెంకీ అట్లూరి డైరెక్ట్ చేస్తున్న సినిమాలో నటిస్తున్నాడు.  



మరింత సమాచారం తెలుసుకోండి: