ఈ మద్య తెలుగు ఇండస్ట్రీలో పరభాష హీరోయిన్ల హవా బాగా నడుస్తుంది. ముఖ్యంగా మళియాళ భామల జోరు బాగా పెరిగిపోయిందనే చెప్పాలి. సాయి పల్లవి, కీర్తి సురేష్, నివేదా థామస్ లాంటి యంగ్ హీరోయిన్లు తమ సత్తా చాటుతూ ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే ఇండస్ట్రీలో సీనియర్ యాక్టర్లు గా పేరు తెచ్చుకున్న కాజల్, నయన్, త్రిష, సమంత లు తమ జోరు కాస్త తగ్గించారు.
రకూల్, రాశిఖన్నా, రెజీనా, లావణ్య త్రిపాఠిలతో పాటు సాయి పల్లవి, కీర్తి సురేష్, నివేదా థామస్ లు తెలుగు, తమిళ ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. ఇక ‘జెంటిల్ మన్’తో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి మొదటి హిట్ను తన ఖాతాలో వేసుకున్న నివేదా థామస్ ఆ తరువాత నిన్నుకోరి, జై లవకుశ సినిమాల్లోనూ నటించే చాన్స్ కొట్టేసి హ్యాట్రిక్ హిట్స్ సాధించింది.
సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఈ ముద్దుగుమ్మ.. తనను తమ అమ్మాయే అని తెలుగువారు అంటున్నారని ఇటీవలే మురిసిపోతూ ఓ ట్వీట్ చేసింది. తెలుగింటి ఆడపడుచులా చక్కని చీర కట్టుకుని, ముస్తాబై, చిరునవ్వులు చిందిస్తూ ఫొటోలు దిగింది. వాటిని ట్విట్టర్లో పోస్ట్ చేసి సంబరపడిపోయింది. 'శారీస్ స్పీక్..' అని పేర్కొంది.
ఈ మద్య హీరోయిన్లు మోడ్రన్ డ్రెస్సులు వేస్తూ ఎప్పుడు హాట్ హాట్ గా ఫోజులు ఇచ్చే సమయంలో వేదా థామస్ సాంప్రదాయంగా చీరకట్టుతో కనిపించడం చాలా మంది అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.