తెలుగు ఇండస్ట్రీలో మొదటి సారిగా సినీ తారలకు సంబంధించిన బయోస్కాపిక్ చిత్రాలు రాలేదు. ఈ మద్య బాలీవుడ్ లో ఈ తరహా చిత్రాలకు మంచి ఆదరణ పెరిగింది. ఈ నేపథ్యంలో తెలుగు తెరపై మొదటి సారిగా మహానటి సావిత్రి బయోస్కాపిక్ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ప్రముఖ నటి సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ టైటిల్ రోల్ పోషిస్తోంది.
ఈ రోజు కీర్తి సురేష్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర నిర్మాణ సంస్థ 'వై జయంతి మూవీస్' వారు ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో ఆకాశ వీధిలో అందాల జాబిలి అనే ట్యాగ్ ఉంది.ఇందులో కేవలం ఆమె కళ్లు మాత్రమే కనిపిస్తున్నాయి. ఆ కళ్లను చూస్తుంటే అచ్చం సావిత్రిని చూసినట్లే ఉండటం విశేషం. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ సావిత్రి పాత్రలో ప్రేక్షకులను అలరించబోతోంది.
సినిమా రంగంలో మహానటిగా ఎదిగిన పరిణామాలతో పాటు, ఆమె జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను సైతం చూపించనున్నారు. వైయంతి మూవీస్ బ్యానర్పై స్వప్నా దత్ నిర్మిస్తోంది. తెలుగు, తమిళ , హిందీ భాషలలో తెరకెక్కిస్తున్నారు.
ఈ చిత్రంలో కీలక పాత్రలో దుల్కర్ సల్మాన్, మోహన్ బాబు, రాజేంద్ర ప్రసాద్, సమంత, విజయ్ దేవరకొండ, శాలిని పాండేలు నటిస్తున్నారు.2018లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.