గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ‘ఏం మాయ చేసావే’ చిత్రం షూటింగ్ సమయంలో నాగ చైతన్య, సమంతలు ప్రేమలో పడ్డారు. కొంత కాలం ప్రేమాయణం కొనసాగించిన వీరిద్దరు పెద్దల ఆశిస్సులతో..అక్టోబర్ 6న హిందూ సంప్రదాయం లో అక్టోబర్ 7న క్రిస్టియన్ పద్దతిలో రెండు సంప్రదాయాల్లో జరిగిన సంగతి తెలిసిందే.  ఆ మద్య చెన్నైలో దగ్గుబాటి ఫ్యామిలీ తరుపున రిసెప్షన్ కూడా జరిగినట్లు వార్తలు వచ్చాయి. 

తాజాగా సమంత తన అత్తగారిల్లు ఎంతో బాగుందని తెగ మురిసిపోతూ చైతూ తల్లి లక్ష్మి కళాభిరుచిని చూసి ఆశ్చర్యపోయింది.  అంతే కాదండోయ్..లక్ష్మి నివాసంలో బొమ్మలు, చెట్ల కొమ్మల ఫోటోలను తన ఇన్స్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసింది.

ఇక తన అత్తారి ఇంట్లోకి అడుగు పెట్టిన రోజే నా అత్తగారిల్లు చాలా అద్భుతంగా ఉంది అంటూ కామెంట్ చేసింది.  మరో ట్విస్ట్ ఏంటంటే..ఈ రిసెప్షన్ లో అత్తాకోడళ్ళిద్దరూ ఒకే రకమైన డ్రెస్ ధరించడం ప్రత్యేక ఆకర్షనగా నిలిచింది.  





మరింత సమాచారం తెలుసుకోండి: