గత కొద్ది రోజులుగా టాలీవుడ్ లో వస్తున్న రకరకాల వార్తలకు తెర పడినట్లుగా తెలుస్తోంది. రెబల్ స్టార్ కృష్ణంరాజు దర్శకత్వంలో నిర్మింపబడుతున్న ‘ఒక్క అడుగు ’ సినిమాలో ప్రభాస్ నటించడానికి బాహుబలి దర్శకుడు రాజమౌళి లైన్ క్లియర్ చేసినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం నడుస్తున్న అంచనాల ప్రకారం బాహుబలి సినిమా వచ్చే సంవత్సరం చివరకు విడుదల అయితే చాలా వేగంగా రాజమౌళి ఈ సినిమాను పూర్తి చేసినట్లే అంటున్నారు.

ఈ నేపధ్యంలో కృష్ణంరాజు తలపెట్టిన మల్టిస్టారర్ మూవీ ‘ఒక్క అడుగు ’ లో నటించాలన్న ప్రభాస్ కోరికను రాజమౌళి మన్నించాడట. కృష్ణంరాజు, శర్వానంద్, నారా రోహిత్ లతో పాటు ఈ సినిమాలో ప్రభాస్ కు కూడా ఒక ముఖ్య పాత్రను అతడి పెదన్నాన్న కృష్ణంరాజు క్రియేట్ చేశారని తెలుస్తోంది. సామాజిక చైతన్యం తో కూడిన ఒక పవర్ ఫుల్ కధతో ‘ఒక్క అడుగు’ సినిమా స్క్రిప్ట్ తయారు అయిందని, ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర చాలా కీలకంగా ఉండడంతో పాటు ప్రభాస్ ఇమేజ్ ను పెంచే విధంగా చాలా పవర్ ఫుల్ డైలాగ్స్ ఈ సినిమాలో ప్రభాస్ పాత్రకు ఉంటాయని, ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో ప్రభాస్ కూడా చాలా శ్రద్ధ తీసుకుంటూ తన పెదనాన్న తో కలిసి మార్పులూ, చేర్పులూ చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి.

రాజమౌళి గ్రీన్ సిగ్నల్ రావడంతో ఈ సినిమా షూటింగ్ సెప్టెంబర్ నెలలో ప్రారంబం అయి వచ్చే సంవత్సరం వేసవి సినిమాల పోటీకి తయారు అయి ఒక్క అడుగు సినిమా రెబల్ స్టార్ అభిమానులకు కనువిందు చేస్తుందని అంటున్నారు. రాజమౌళి మరో సినిమాలో నటించడానికి ప్రభాస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లే, ఇక పెళ్ళికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తే వచ్చే సంవత్సరంలో ఒక్క అడుగు తో పాటు ఏడు అడుగులు కూడా వేసేస్తాడు అనుకోవాలి.
 

మరింత సమాచారం తెలుసుకోండి: