ఈ మద్య సెలబ్రెటీలకు సంబంధించి ఏ చిన్న విషయమైనా సోషల్ మీడియాలో పెద్ద రగడ చేస్తున్నారు. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వార్తలు అయితే ప్రతిరోజూ ఏదో ఒక సెన్సేషన్ క్రియేట్ అవుతూనే ఉంది. ఈ మద్య అమలా పాల్ కారు కు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేసింది.
అమలాపాల్ నకిలీ అడ్రెస్ ప్రూఫ్ తో కోటి రూపాయలు విలువ చేసే ఎస్-క్లాస్ బెంజ్ కారు కొనుక్కుందని, దీనికి ట్యాక్స్ 20 లక్షల రూపాయలు ఉంటుందని, ఈ మొత్తాన్ని ఎగ్గొట్టేందుకే ఆమె నకిలీ ప్రూఫ్ తో కారును కొనుగోలు చేసిందని కోలీవుడ్ మీడియాలో గత కొంతకాలంగా వార్తలు వెలువడుతున్నాయి.
దీనిపై స్పందించిన ఈ అమ్మడు తన ట్విట్టర్ ఖాతా వేదికగా స్పందిస్తూ..‘బోట్ రైడ్ కు వెళ్లాలనుకుంటున్నాను...ఇలా చేస్తే చట్టాన్ని వ్యతిరేకిస్తున్నట్లా? ఒక్కోసారి ఈ సమాజం నుంచి నాపై వస్తున్న ఆరోపణల నుంచి దూరంగాపారిపోవాలనిపిస్తుంది’. అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. అమలాపాల్ కారు విషయంలో వచ్చిన వార్తలపై పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ స్పందిస్తూ, ఆమెపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
కాగా, అమలాపాల్ ఎలాంటి తప్పు చేయలేదని పుదుచ్చేరి రెవెన్యూ, రవాణా శాఖ మంత్రి షాజహాన్ క్లీన్ చిట్ ఇచ్చారు. ఆమె కారుకు సంబంధించిన అన్ని వివరాలు చట్టపరిధిలోనే ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు