టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో అద్బుతమైన పాటలు పాడి..ఎన్నో అవార్డులు, రివార్డులు కైవసం చేసుకున్న జెండరీ సింగర్ పి . సుశీల పై సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేశాయి. తాను బతికే ఉన్నానని చెప్పుకోవాల్సిన దుస్థితి తలెత్తింది. వాట్సాప్లో ఎవరో ఒక ఆకతాయి చేసిన పోస్టింగ్లో నిజం లేదనీ, అది వట్టి వదంతేనంటూ ఓ సెల్ఫీ వీడియోను శుక్రవారం తన సామాజిక మాధ్యమ ఖాతాల్లో పోస్ట్ చేశారు. ఆమె మరణించిందని మధుర గాయని అస్తమయం అని వార్తలు వచ్చాయి.
నిన్న రాత్రి గాయని సుశీల మరణించినట్లు వార్తలు రావడమే కాకుండా పలువురు ఆమె మృతి కి సంతాపం కూడా తెలియ జేస్తుండటంతో ఈ వార్తలు అమెరికాలో ఉన్న సుశీల చెవిన పడ్డాయి దాంతో ఖంగుతిన్న సుశీల ఓ వీడియో బైట్ ని పంపించింది. ప్రస్తుతం తాను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నానని..నెల రోజుల క్రితం అమెరికా వచ్చానని..రేపు ఇండియా వస్తున్నానని ప్రకటించింది.
81 ఏళ్ల వయసున్న పి . సుశీల భారతీయ చలనచిత్ర చరిత్రలో సరికొత్త చరిత్ర సృష్టించింది. తెలుగు లోనే కాకుండా వివిధ భాషల్లో ఆమె తన అమృతగానంతో అలరించింది. మొత్తానికి కొంతమంది అత్యుత్సాహం ఎలా ఉన్నప్పటికీ మధుర గాయని సుశీల ఆరోగ్యంగా ఉండటం సంతోషించతగ్గ విషయం .