ఈ మద్య తెలుగు ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి.  గత నెలలో సినిమా ఇండస్ట్రీకి చెందిన పలురువు కాలం చేసిన విషయం తెలిసిందే. తాజాగా  సీనియర్ దర్శక నిర్మాత హనుమాన్‌ ప్రసాద్ (74)అనారోగ్యంతో కన్నుమూశారు. హనుమాన్ ప్రసాద్ పది చిత్రాలను నిర్మించారు.ప్రసాద్‌ స్వీయ దర్శకత్వంలో కలియుగ మహా భారతం లాంటి ఛాయ చిత్రాలను కూడా తెరమీదకెక్కించారు.

తల్లీకూతుళ్ళు, శారద, తిరుపతి సినిమాలును ఆయన నిర్మించారు.ఈ నెల 9న విజయవాడలో హనుమాన్‌ ప్రసాద్‌ అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 

ప్రముఖ నటులు, నిర్మాత ఎంపీ మురళీ మోహన్ హనుమాన్ ప్రసాద్ మృతికి  సంతాపం వ్యక్తం చేశారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..హనుమాన్‌ ప్రసాద్ విలువలకు పెద్ద పీట వేశారని కొనియాడారు.  హనుమాన్‌ ప్రసాద్ మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు తమ ప్రగాడ సానుభూతిని తెలిపారు.



మరింత సమాచారం తెలుసుకోండి: