తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎన్నో ప్రేమజంటలు వచ్చాయి. ‘ఏం మాయ చేసావే’ చిత్రంతో పరిచయం అయిన అక్కినేని నాగ చైతన్య, సమంతల కొంత కాలంగా ప్రేమించుకున్నారు. ఆటో నగర్ సూర్య, మనం చిత్రంలో జంటగా కనిపించారు. గత సంవత్సరం తమ కుటుంబ పెద్దలతో ప్రేమ వివాహం చెప్పడం వారి దీవెనలు తీసుకోవడం జరిగింది. వీరిద్దరి వివాహం అంగరంగ వైభవంగా గత రాత్రి గోవాలో జరిగింది.. హిందూ , క్రిస్టియన్ సాంప్రదాయాల్లో ఒక్కటయ్యారు ఈ జంట.
నాగ చైతన్య - సమంతల వివాహం జరిగి నెలరోజులైంది. వివాహానంతరం నాగచైతన్య తల్లి లక్ష్మి చెన్నైలో విందు ఏర్పాటు చేయడం, పలువురు ప్రముఖులు హాజరుకావడం తెలిసిందే. మరోవైపు హైదరాబాద్ లో కూడా ఓ విందు ఏర్పాటు చేస్తామని నాగార్జున గతంలో ప్రకటించారు. ఈ నెల 12న లేదా ఆ మరుసటి రోజున ఈ విందు కార్యక్రమం ఉంటుందని ఫిల్మ్ నగర్ వర్గాల ద్వారా తెలుస్తోంది.
తాజాగా నాగచైతన్య-సమంతల వివాహం తర్వాత అక్కినేని, దగ్గుబాటి కుటుంబం కలిసి సరదాగా గడిపారు. దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి. ఈ వేడుకకు నాగచైతన్య తల్లి లక్ష్మి,నిర్మాత దగ్గుబాటి సురేష్, నటులు వెంకటేశ్, రానా తదితరులు హాజరయ్యారు.