అలనాటి మేటి హీరోయిన్ శ్రీదేవి తన కూతురు జాన్వి కపూర్ ని ఎప్పుడెప్పుడు హీరోయిన్ గా లాంచ్ చెయ్యలా అని చూస్తోంది . కరణ్ జోహార్ లాంటి పెద్ద టాప్ డైరెక్టర్ / ప్రొడ్యూసర్ తన కూతురు ని లాంచ్ చేస్తే గనుక తనకి అంతా సూపర్ ఫ్యూచర్ ఉంటుంది అనేది శ్రీదేవి ఆలోచన.

అయితే ఈ సినిమా విషయం లో అనేక డిస్కషన్ లు జరుగుతూ ఉన్నాయి. జాన్వి ని కరణ్ జోహార్ అసలు ఇంట్రడ్యూస్ చెయ్యాలి అనే ఆసక్తి లో ఉన్నదా లేదా అంటూ బాలీవుడ్ జనాలు చెవులు కొరుక్కుంటున్నారు.

మరాఠీ లో సూపర్ హిట్ గా నిలిచిన సైరాట్ సినిమాని రీమేక్ చెయ్యడం కోసం జాన్వి ఓకే చెప్పింది అని టాక్. ఈ చిత్రంలో షాహిద్ క‌పూర్ స‌వ‌తి సోద‌రుడు ఇషాన్ ఖ‌ట్ట‌ర్ హీరోగా న‌టించ‌నున్నాడు.

'బ‌ద్రినాథ్ కీ దుల్హానియా' చిత్ర ద‌ర్శ‌కుడు శ‌శాంక్ ఖైతాన్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నాడు. అలాగే నిర్మాణ బాధ్య‌త‌లు క‌ర‌ణ్ జొహార్ తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. మ‌రాఠిలో రింకు రాజ్‌గురు, ఆకాశ్ థోస‌ర్‌లు న‌టించిన 'సైరాట్‌' చిత్రం రూ. 100 కోట్లు వ‌సూలు చేసిన మొద‌టి మ‌రాఠి చిత్రంగా నిలిచింది.


మరింత సమాచారం తెలుసుకోండి: