మెగాస్టార్ చిరంజీవి నివాసంలో రూ. 2 లక్షల నగదు చోరీ అయినట్లు చిరు మేనేజర్ గంగాధర్ నిన్న పోలీసులకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ చోరీ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా చిరంజీవి ఇంటి పనిమనిషి చెన్నయ్యను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు.
చిరంజీవి ఇంట్లో చిన్నయ్య గత పదేండ్లుగా పనిచేస్తుండగా, ఇప్పటి వరకు పలు విడతలుగా రూ.16లక్షలు దొంగిలించినట్టు నిర్ధారణ అయింది. ఇక అతను రెండు చోట్ల ఫ్లాట్స్ కూడా కొనుగొలు చేసినట్టు ఎంక్వైరీలో తేలింది.
ఫ్లాట్స్ పత్రాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు, నిందితుడి నుండి మరింత సమాచారాన్ని రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి త్వరలో సైరా అనే పీరియాడికల్ మూవీతో బిజీ కానున్న విషయం విదితమే.