‘శివ’ సినిమాతో ట్రెండ్ సెట్ చేసిన రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తిరిగి నాగార్జున నటిస్తూ ఉండటం ప్రస్తుతం హాట్ న్యూస్ గా మారింది. పరాజయాల బాటలో పయనిస్తున్న వర్మ దర్శకత్వంలో నాగార్జున సినిమాను అంగీకరించడం వెనుక ఆంతర్యం ఏమిటి అనేకోణంలో కూడ చర్చలు జరుగుతున్నాయి. ఈనెల 20 నుండి షూటింగ్ ప్రారంభంకాబోతున్న ఈసినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన సీక్రెట్ ను నాగార్జున ఒకమీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో లీక్ చేసాడు. 

తన వద్దకు వర్మ మూడు నెలల క్రితమే వచ్చి ఒక మంచికథ చెప్పాడని అయితే ఆకథ తనకు బాగా నచ్చినా ఇతర సినిమాలు ఏమైనా ఉంటే పక్కన పెట్టి తన సినిమాపై మాత్రమే పూర్తి ఫోకస్ పెట్టాలని కండీషన్ తో తాను వర్మ మూవీ ప్రాజెక్ట్ కు ఓకె చెప్పానని అంటున్నాడు నాగార్జున. ఇదే ఇంటర్వ్యూలో మరికొన్ని ఆసక్తికర విషయాలను షేర్ చేసాడు నాగార్జున. ప్రస్తుతం తనజీవితం చాల ఆనందంగా ఉందని తన ఇద్దరు కుమారులు నాగచైతన్య, అఖిల్‌ సినీ కెరీర్‌లో రాణించడానికి చాలా కష్టపడుతున్నారని తన షాడో నుండి బయటపడి తమకు తాముగా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని కామెంట్ చేసాడు నాగార్జున. 


 ఇదే సందర్భంలో తన కోడలు సమంత గురించి మాట్లాడుతూ ‘పెళ్లికి ముందే ఆమె మాకుటుంబంలో కలిసిపోయిందని’ చెపుతూ ఒక విషయంలో మాత్రం తేడా వచ్చింది అని అంటున్నాడు. సమంత అంతకు ముందు తనను ‘నాగ్‌ సర్‌' అని పిలిస్తే ఇప్పుడు ‘మామ' అంటోంది అని జోక్ చేసాడు. తన పిల్లల ఆనందం తనకు ముఖ్యం అని చెపుతూ అంతకు మించి ఏమీ తనకు ఏమి కోరికలు లేవు అని అంటున్నాడు నాగ్. అఖిల్‌ నటిస్తున్న ‘హలో' సినిమా డిసెంబర్ లో విడుదల కాబోతోంది అని చెపుతూ ఈసినిమాతో అఖిల్ మళ్ళీ ట్రాక్ లోకి వస్తాడు అన్న లీకులు ఇస్తున్నాడు. 



ఇటీవల తన 58వ పుట్టినరోజు వేడుకను చాలా చిన్నగా ఫ్యామిలీ గెట్ టు గెదర్ గా జరుపుకున్న విషయాన్ని చెపుతూ ఆ రోజు తన అమ్మా నాన్నలను గుర్తు చేసుకున్న విషయాన్ని తెలియచేసాడు. సినిమాలలో నటించకపోతే తనకు జీవితం బోర్ గా అనిపిస్తుంది అంటూ తనకు ఓపిక ఉన్నంత కాలం నటిస్తూనే ఉంటాను అన్న సంకేతాలు ఇస్తున్నాడు నాగార్జున.



మరింత సమాచారం తెలుసుకోండి: