బాహుబలి సినిమాతో తన స్థాయిని అమాంతం పెంచుకున్న అనుష్క ప్రస్తుతం భాగమతి సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం ప్రేక్షకులు దాదాపు ఆరు నెలలుగా ఎదురు చూస్తున్నారు. ఇదో ఛారిత్రాత్మక నేపథ్యం ఉన్న సినిమా అని మొదట భావించారు. ఆ తర్వాత ఇదో సోషియో ఫాంటసీ సినిమా అంటూ వార్తలు వచ్చాయి. కాని ఇదో సాదారణ సోషల్ సినిమా అని, విభిన్న కథతో తెరకెక్కిన మంచి సినిమా అంటూ చిత్ర యూనిట్ సభ్యులు క్లారిటీ ఇచ్చారు.
ఇక ఈ చిత్రంలో అనుష్క ద్విపాత్రాభినయం అంటూ కూడా మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. తాజాగా విడుదలైన భాగమతి ఫస్ట్లుక్ పోస్టర్కు అద్బుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్లుక్ రెస్పాన్స్తో చిత్రంపై ప్రేక్షకుల్లో ఏ స్థాయిలో అంచనాలున్నాయో తేలిపోయింది. డబుల్ రోల్ అంటూ మరింతగా ప్రేక్షకులు అంచనాలు పెంచుకుంటున్న నేపథ్యంలో దర్శకుడు అశోక్ పుకార్లపై క్లారిటీ ఇచ్చాడు.
ఈ సినిమాలో అనుష్క ద్విపాత్రాభినయం చేస్తుంది అంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు. అయితే ఇదో విభిన్న కథా చిత్రం. ఈ చిత్రంలో అనుష్క పోషిస్తున్న పాత్ర ఆమె కెరీర్లో ది బెస్ట్ పాత్రల్లో ఒక్కటి అవుతుందని భావిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. సంక్రాంతికి విడుదల కాబోతున్న ఈ సినిమా వార్తలపై అశోక్ క్లారిటీ ఇవ్వడంతో ప్రేక్షకులు కాస్త నిరాశ చెందుతున్నారు.
అరుంధతి తర్వాత అనుష్కను మళ్లీ డబుల్ రోల్లో చూస్తామని ఆశించిన వారి ఆశలు నీరుగారి పోయాయి. ప్రస్తుతానికి సినిమా గురించి ఎలాంటి వార్తలు బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు. వచ్చే నెలలో ప్రమోషన్స్ ప్రారంభించనున్నారు. ఏది ఎలా ఉన్నా ఫస్ట్ లుక్ తో అంచనాలను పెంచేసిన దర్శకుడు ఆ రేంజ్ కథ కథనాలతో వస్తాడో లేదో చూడాలి.