గత కొంత కాలంగా సినిమా ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి.    ప్రముఖ మ్యూజిక్‌డైరెక్టర్ ఆదిత్యన్ (63)కన్నుమూశారు. కిడ్నీ ఫెయిల్యూర్‌తో బాధపడుతున్న ఆదిత్యన్ హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు.  అమరన్, సీవల్‌ పేరి  పాండి,   కోవిల్‌పట్టి వరలక్ష్మి  తదితర చిత్రాలు ఆయన సంగీత సారధ్యంలో  వచ్చిన ప్రముఖ చిత్రాలు.

తన సొంత చిత్రాలకు, ఇతర స్వరకర్తలకు కూడా అనేక పాటలను పాడారు. అంతేకాదు   ఇండియా,  మలేషియాలో విడుదలైన తమిళ పాప్‌, రీమిక్స్‌ ఆల్బమ్స్‌ ద్వారా  ప్రసిద్ది చెందారు.  సీవల్‌ పేరి పాండి, నాయ‌ల సైది వంటి సినిమాల‌కు ఆయ‌న అందించిన సంగీతం ప్ల‌స్ పాయింట్ గా నిలిచింది.
Tamil music composer Adithyan passes away at 63 - Sakshi
త‌న కూతురిని చూడటానికి హైద‌రాబాద్‌కు వ‌చ్చిన ఆదిత్య‌న్ ఒక్క‌సారిగా కుప్పకూలిపోయి చ‌నిపోయారు. ఆయ‌న‌ కిడ్నీ ఫెయిల్యూర్ అయింద‌ని తెలిసింది. ఆదిత్యన్‌ అకాలమృతిపై పలువురు  సినీ ప్రముఖులు, ఇతర నటీనటులు  దిగ్ర్భాంతిని,  సంతాపాన్ని వ్యక‍్తం చేశారు. రేపు చెన్నైలో ఆయ‌న‌ అంత్యక్రియలను నిర‍్వహిస్తారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: