ఈ మద్య పవన్ కళ్యాన్ పై ఏ చిన్న విషయం అయినా సోషల్ మీడియాలో ఇట్టే వైరల్ అవుతుంది.  ఆ మద్య ఫిల్మ్ క్రిటిక్ కత్తి మహేష్ జనసేన అధ్యక్షులు, నటుడు పవన్ కళ్యాన్ పై వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడంతో సోషల్ మీడియా వేదిక చేసుకొని మనోడిని దుమ్ముదులిపారు పవన్ ఫ్యాన్స్.   విశాఖపట్టణంలో డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (డీసీఐ) ఉద్యోగులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మద్దతుగా నిలిచిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో నేటి నుంచి మూడు రోజుల పాటు వైజాగ్ లో పర్యటిస్తున్నారు.  తాజాగా మరోసారి పవన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు కత్తి మహేష్.  ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..పవన్ కళ్యాన్ విశాఖ పర్యటలో ఎంతో ఆంతర్యం దాగి ఉందని.. ‘ఏక్ పంత్ దో కాజ్’ అంటే ఒక దెబ్బకు రెండు పిట్టలు. అటు రాజకీయపరంగా లాభముంటుంది, ఇటు సినిమా పరంగా ప్రమోషన్ జరిగిపోతుంది.
Image result for katti mahesh
ఒకే దెబ్బకు రెండు పిట్టలు కొట్టడమనేది తప్పు కాదని అన్నారు.  అంతే కాదు ఇప్పుడు సమయం కూడా తక్కువ ఉండటంతో రెండింటికి పనికొచ్చే పని చేస్తుంటే అంతకన్నా ఏం కావాలి? పవన్ కల్యాణ్ మంచి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికైనా, ఆయన జనాల్లోకి వెళుతున్నారు. ఇక జనాల్లోకి వెళ్లడం ఆయనకు రెండు విధాలుగా పనికి వస్తుందంటూ..అంటూ వ్యాఖ్యానించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: