స్ట్రాటజీలు వేయడంలో అల్లుఅర్జున్ ఎప్పుడూ ముందువరసలోనే ఉంటాడు. తాను నటించే ప్రతి సినిమాకు డిఫరెంట్ కథ ఉండేలా ప్రయత్నిస్తూ తన ప్రతి సినిమాలోను ఒకకొత్త లుక్ లో కనిపించడానికి ఎన్నో జాగాత్తలు తీసుకుంటాడు బన్నీ. సక్సస్ ట్రాక్ లో ఉన్న దర్శకులను వల వేసి పట్టుకోవడంలో అల్లుఅర్జున్ ఎంతో నేర్పరి అని అంటారు. 

అయితే ఇతడు సామాన్యంగా కొత్త దర్శకుల జోలికి వెళ్ళడు. అయితే గతంలో మాత్రం సుకుమార్‌ కు తన ‘ఆర్య’ తో ఛాన్స్ ఇచ్చి సుకుమార్ ప్రతిభ ఇండస్ట్రీకి తెలిసివచ్చేలా చేసాడు. అయితే ఆతరువాత మళ్ళీ బన్నీ కొత్తదర్శకుల జోలికి వెళ్ళలేదు. బాగా పాపులర్ అయి సూపర్ హిట్స్ ఇస్తున్న దర్శకులతోనే సినిమాలు చేసుకుంటూ వచ్చాడు. కానీ ఇప్పుడు అల్లుఅర్జున్ ఆలోచనలు మారిపోయాయి అని అంటున్నారు. 

ప్రస్తుతం వక్కంతం వంశీని దర్శకుడుగా పరిచయం చేస్తూ ‘నాపేరు సూర్య’ సినిమాలో నటిస్తున్న బన్నీ తన తరువాత సినిమాకు కూడ మళ్ళీ ఒక యంగ్ డైరెక్టర్ కు ఛాన్స్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు ప్రభాస్ కు సన్నిహితులైన యూవీ క్రియేషన్స్ నిర్మాణ సంస్థ ఈ అల్లు వారి హీరోతో ఒకడిఫరెంట్ మూవీని వచ్చే సంవత్సరం మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఈసినిమాకు సంబంధించి ప్రస్తుతం యూవీ క్రియేషన్స్ లో డైరెక్టర్ డిపార్టమెంట్ లో పనిచేస్తున్న ఇద్దరు యంగ్ డైరెక్టర్స్ ప్రశాంత్ సంతోష్ రెడ్డిలు చెప్పిన రెండు డిఫరెంట్ కథల పై అల్లు అర్జున్ మనసు పారేసుకున్నాడు అని అంటున్నారు. 

అన్నీ కుదిరితే సంతోష్ రెడ్డి కథతో యూవీ క్రియేషన్ బ్యానర్ పై  అల్లుఅర్జున్ సినిమా ఖాయం అని అంటున్నారు. ప్రస్తుతం సీనియర్‌ దర్శకుల వద్ద కథల్లో కొత్తదనం ఉండడం లేదని ఇప్పుడు బన్నీ ఇలా యువ దర్శకులని ఎంకరేజ్‌ చేస్తున్నాడు అని అంటున్నారు. దీనితో ఇటీవల తరచుగా కొత్త దర్శకులు గీతా ఆర్ట్స్‌ కాంపౌండ్‌లో తెగ కనిపిస్తున్నారట. కొత్త ఐడియాలున్న దర్శకులు తనని అప్రోచ్‌ అవ్వవచ్చునని బన్నీ ఈవిధంగా సంకేతాలు కూడ ఇస్తున్నాడట. ఏమైనా బన్నీ స్ట్రాటజీ ప్రస్తుతం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది..  


మరింత సమాచారం తెలుసుకోండి: