బాహుబలి తో ఇండియన్ సినిమా రికార్డ్స్ ను కొల్లగొట్టిన దర్శకధీరుడు యస్ యస్ రాజమౌళి తెలుగు సత్తాను ప్రపంచానికి పరిచయం చేశాడు. బాలీవుడ్ సైతం ముక్కున వేలేసుకునేలా, ఇండియన్ ఇండస్ట్రీ లో ఇటివంటి సినిమా ను చూస్తామా అనెంతలా బాహుబలి ని చూపించాడు. అయితే రాజమౌళి, తరువాత ఎటువంటి సినిమా చేస్తాడని ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ  మొత్తం  ఎదురుచూసింది. అయితే తన ట్విట్టర్ లో రాజమౌళి పోస్ట్ చేసిన పిక్ తో అందరిని మెస్మరైజ్ చేశాడు. తను తీయబోయే సినిమా మల్టిస్టారర్ అని చెప్పకనే చెప్పాడు. అయితే అది అలాంటి, ఇలాంటి ముల్టిస్టారర్ అయితే తను రాజమౌళి ఎందుకు అవుతాడు.


ఒక వైపు యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరొక వైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్. వీళ్లిద్దరు నటిస్తున్నారు అని తెలియగానే ఈ న్యూస్ టాలీవుడ్ లో సెన్సేషన్ అయింది. మాములుగా ఇప్పటి వరకు తెలుగులో మల్టీస్ట్రారర్ అంటే ఒక సీనియర్ హీరో మరియు జునియర్ హీరో నటించేవారు. కాని రాజమౌళి మల్టిస్ట్రారర్ లో ఇద్దరు టాలీవుడ్ యంగ్ బిగ్గెస్ట్ స్త్రార్స్ ఇద్దరు కుడా పెద్ద కుటుంబ నేపధ్యం నుంచి వచ్చినవారే. అస్సలు ఇటువంటి కాంబినేషన్ సెట్ అవ్వడం అంటే మాములు విషయం కాదు. ఎందుకంటే హీరోల అభిమానుల మద్య ఎన్నో ఈగోస్ ఉంటాయి. తమ హీరో గొప్పంటే తమ హీరో గొప్పని ఎప్పుడు కొట్టుకుంటా ఉంటారు. ఒక హీరోను తక్కువగా చూపించి , ఇంకొక హీరోని ఎక్కువగా చూపించినా ఫ్యాన్స్ మద్య గొడవలు పెరిగిపోతాయి.

Image result for rajamouli

అందుకే ఇటువంటి మల్టీస్టారర్ ను డీల్ చేయడానికి ఇంత వరకు ఏ డైరెక్టర్ సాహసం చేయలేదు మరియు ఏ డైరెక్టర్ హీరోస్ ని ఒప్పించలేడు. కాని ఇప్పుడు డీల్ చేస్తున్నది ఇండియన్ డైరెక్టర్ , దర్శకధీరుడు యస్ యస్ రాజమౌళి కాబట్టి వాళ్ళిద్దరిని ఒప్పించి భారి సంచలనలాలకు తెర తీశాడు. నిజం చెప్పాలంటే ఇటువంటి ఇద్దరు స్టార్స్ తో సినిమా చేయాలి అంటే కత్హి మీద సాము లాంటిది. కాని అక్కడ ఉండేది రాజమౌళి, బాహుబలి లాంటి సినిమా ను రెండు పార్ట్స్ గా విడగొట్టి చూపించిన విధానానికి విమర్శకలు సైతం నోరెళ్లబెట్టారు.

 Image result for rajamouli

రాజమౌళి ఈ మల్టీస్ట్రారర్ విషయంలో జాగ్రత్తగా ఉంటాడని ప్రేత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమా విషయం లో అటు ఇటు అయితే ఎలా ఉంటుందన్న విషయం రాజమౌళి కి బాగా తెలుసు. అందుకే అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ లుకు సంబధించిన సీన్స్ సమానంగా ఎక్కడ తగ్గకుండా తన టీం తో కసరత్తు చేస్తున్నాడు . అది ఎటువంటి స్టొరీ అయినా గుండెని పిండేసే బావోద్వేగాలు రాజమౌళి సినిమా లో ఉంటాయని తెలిసిందే . ఈ మల్టీ స్ట్రారర్ విషయం తెలేసినప్పటి నుంచి ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. స్టార్ట్ అయిందో లేదో అంచనాలు తార స్థాయి కి చేరాయి. ఈ సినిమా టాలీవుడ్ చరిత్ర లో సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: