బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా హిందీలోనే కాకుండా హాలీవుడ్‌లోనూ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. దేశంలోకెల్లా అత్యధిక పారితోషకం పొందుతున్న నటీమణుల్లో ఆమె ఒకరు. ఈ బాలీవుడ్ బ్యూటీ గురించి ఆసక్తికర కథనాన్ని మిడ్ డే ప్రచురించింది. బాలీవుడ్‌లోనే కాదు హాలీవుడ్‌లోనూ సినిమాలు చేస్తూ మంచి పేరు తెచ్చుకుంటున్న హీరోయిన్ ప్రియాంక చోప్రా. అవెురికన్ టి.వి. సిరీస్ ‘క్వాంటికో’ ఆమెకు మంచి గుర్తింపు తెచ్చింది. ఇదిలా వుంటే డిసెంబర్ 19న జీ సినీ అవార్డుల వేడుక జరగనుంది.  

ఈ వేదికపై ప్రియాంక ఓ ప్రదర్శన ఇవ్వబోతున్నారు. హిందీ సినిమాల్లో నటిస్తూనే అవెురికన్ టి.వి. సిరీస్‌లో బిజీ అయిపోయిన ప్రియాంక నిర్మాతగా ‘వెంటిలేటర్’, ‘సర్వన్’ అనే మరాఠీ, పంజాబీ చిత్రాలను నిర్మించారు. వీటి తర్వాత మరో రెండు సినిమాలు ప్లానింగ్‌లో ఉన్నాయట. అలాగే వచ్చే సంవత్సరం రెండు హాలీవుడ్ సినిమాల్లో ప్రియాంక చోప్రా కనిపించనుంది.

ఆమెకు దాదాపు ఐదు రూ. 5 కోట్లు చెల్లించేందుకు నిర్వాహాకులు ఓకే చెప్పారట. అంటే నిమిషానికి కోటి రూపాయల చొప్పున ప్రియాంక చోప్రా సంపాదించ నుందన్నమాట. ఆమె 2016లో ప్రొడ్యూసర్‌ గిల్డ్‌ అవార్డుల వేడుకలో ఓ పాటకు డ్యాన్స్‌ కూడా చేసింది. ఈ కార్యక్రమంలో ప్రియాంకతో పాటు షాహిద్‌ కపూర్‌, జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ తదితరులు వేదికపై తమ ప్రదర్శనలు ఇవ్వనున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: