ఈరోజు సాయంత్రం జరగబోతున్న ‘అజ్జాతవాసి’ ఆడియో ఫంక్షన్ గురించి ఎదురు చూస్తున్న పవన్ అభిమానులకు నిర్మాత దిల్ రాజ్ బయట పెట్టిన పవన్ లేటెస్ట్ కమిట్ మెంట్ వార్తలు ఒకవైపు ఆనందాన్ని మరోవైపు అయోయాన్ని సృష్టిస్తున్నాయి. పవన్ ఈమధ్య నాలుగు రోజులపాటు ఆంధ్రప్రదేశ్ లో ని వివిధ ప్రాంతాలలో పర్యటిస్తూ అనేక విషయాలపై ఘాటైన విమర్శలు చేసిన విషయం తెలిసిందే.

 

తాను సినిమాలన్నీ మానుకుని ఇక్కడకు వస్తున్నానంటూ పదేపదే సూటిగా చెపుతూ ‘అజ్ఞాతవాసి’ తరువాత రాబోతున్న ఎన్నికలలోపు తన వైపు నుండి ఇక సినిమాలు ఉండవు అన్న సంకేతాలు ఇచ్చాడు. దీనితో పవన్ అభిమానులు ‘అజ్ఞాతవాసి’ పవన్ ఆఖరి సినిమా అనుకుంటున్నారు.

 

ఇలాంటి పరిస్థితులలో దిల్ రాజ్ ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ పవన్ ప్రామిస్ వార్తలను తెరపైకి తీసుకువచ్చి అనేక చర్చలకు తెర తీసాడు. రాజకీయాల్లో ఇచ్చిన కమిట్మెంట్లతో సంబంధం లేకుండా పవన్ కల్యాణ్ తనతో ఒక సినిమాను చేస్తున్నాడని ఒక షాకింగ్ లీక్ ఇచ్చాడు. అయితే ఈమాట ఎప్పటి నుంచో వినపడుతున్నదే అయినా ఇప్పుడు రాజు వ్యూహాత్మకంగా 'రాజకీయాలతో సంబంధం లేకుండా' అంటూ స్ట్రస్ చేయడం ప్రస్తుతం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది.

 

దీనితో  నిజంగానే పవన్ ఈ ప్రామిస్ ను నిలబెట్టుకుంటాడా ? అలా అయితే మొన్న రాజకీయ టూర్ లో ఆయన ‘అజ్ఞాతవాసి’ ఆఖరి సినిమా అంటూ ఎందుకు చెప్పాడు అంటూ చర్చలు సాగుతున్నాయి. గతంలో  కూడ పవన్ కళ్యాణ్ నటించే సినిమాల గరించి చాలామంది నిర్మాతలు ఇలాంటి లీకులు ఇచ్చారు. దివంగత దర్శకరత్న దాసరి నారాయణరావు దగ్గరనుండి నిర్మాత  ఎం.ఎం.రత్నం వరకు ఇలాంటి లీకులు ఇచ్చినవారు చాలామంది ఉన్నారు. ఇది చాలదు అనట్లుగా మైత్రి మూవీస్ కూడ పవన్ పిలుపుగురించి ఎదురు చూస్తోంది. మరి ఈ వాగ్దానాలన్నీ పవన్  ఎప్పుడు నిలబెట్టుకుంటాడు లేదంటే మాట తప్పుతడా అంటూ ఆసక్తికర చర్చలు ఇండస్ట్రీ వర్గాలలో జరుగుతున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: