ఒకప్పుడు వెండి తెరపై తమ సోయాగాలతో కుర్రకారు మతులు పోగొట్టిన హీరోయిన్లు ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెడుతున్న విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో కొంత మంది సినిమాలో అత్త, అమ్మా, అక్క పాత్రల్లో నటిస్తుంటే..కొంత మంది బుల్లితెరపై యాంకర్లుగా, జడ్జీలుగా వస్తున్నారు.  కెరీర్ పరంగా వారికి ఉన్న ఇమేజ్ ని బట్టి బుల్లితెరపై వారికి ఆ గౌరవం ఇస్తున్నారు.  ఇప్పటికే పవన్ కళ్యాన్ మాజీ భార్య రేణు దేశాయ్, ఒకప్పుడు చిరంజీవితో స్టెప్పులేసిన రంభ ఇలా ఎంతో మంది నటీమణులు బుల్లితెరపై జడ్జీలుగా వస్తున్నారు. 
Image result for pawan thammudu posters
తాజాగా మరో హీరోయిన్ బుల్లితెరపై జడ్జీగా రావడాసిని సిద్దమవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నారు.  పవన్ కళ్యాన్ తో ‘తమ్ముడు’ చిత్రంతో హీరోయిన్ గా నటించి ఆ తర్వాత మోహన్ బాబు, బాలకృష్ణ వంటి హీరోలతో రొమాన్స్ చేసిన ప్రీతి పెళ్లి చేసుకొని వెండి తెరకు దూరం అయ్యింది.  ప్రీతి జింగానియా బుల్లితెరపై  'జెమ్స్ ది ఇండియన్ టాలెంట్' హంట్ అనే షో కి ప్రీతి జింగానియా ఓ జడ్జ్ గా వ్యవహరించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రీతి జింగానియా మాట్లాడుతూ.. కొత్త కాన్సెప్ట్ డిఫరెంట్ గా అనిపించింది. 
Image result for ప్రీతి జింగానియా
ఈ సందర్భంగా మాట్లాడుతూ..ఇప్పటి వరకు బుల్లితెరపై ఎన్నో డ్యాన్స్ షోలు చూశాను కానీ ఇది చాలా డిఫరెంట్ గా అనిపించడంతో జడ్జీగా వ్యవహరించడానికి ఒప్పుకున్నట్లు తెలిపింది. అంతే కాదు జడ్జ్ గా వ్యవహరించమని అడిగినప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యానంటూ చెప్పుకొచ్చింది. ఈ షోకి ప్రీతి తో పాటు ప్రముఖ డ్యాన్స్ మాస్టర్, కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ కూడా జడ్జ్ గా వ్యవహరించనుండగా.అందాలతార ఉదయ భాను యాంకర్ గా చేయనున్నది.  

Image result for prithi jengania

ఈ సందర్భంగా ఉదయభాను మాట్లాడుతూ.. విల్ పవర్ ఉంటే ఏదైనా సాధించగలమని చిన్నా గారితో మాట్లాడిన తర్వాతే అర్థమయ్యింది. సముద్రం లోతంత టాలెంట్ ఉంది. అవకాశం వస్తే నిరూపించుకోవడానికి ఇండియాలో చాలామంది ఎదురు చూస్తున్నారు. ఈ అవకాశాన్నీ చిన్నా గారు ఈ షో ద్వారా కల్పిస్తున్నారు. ఇటువంటి గొప్ప షోకు నేను యాంకర్ గా ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని హిట్ చేసే బాధ్యత కూడా మా అందరిపై ఉందని భావిస్తున్నాను.. అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: