టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబు, మురుగదాస్ కాంబినేషన్ లో వచ్చిన ‘స్పైడర్’ సినిమాపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు..కానీ తీరా రిలీజ్ అయిన తర్వాత ఆ అంచనాలు అన్నీ తలకిందులయ్యాయి. మహేష్ బాబు కెరీర్ లో ‘బ్రహ్మోత్సవం’ తర్వాత ‘స్పైడర్’ భారీ డిజాస్టర్ గా మిగిలిపోయింది. ప్రస్తుతం మహేష్ బాబు కథానాయకుడిగా నటిస్తున్న 24వ చిత్రం 'భరత్ అనే నేను'. ఆ మద్య ‘శ్రీమంతుడు’ తో బ్లాక్ బస్టర్ అందించిన కొరటాల ఈ సినిమాకు దర్శకులు. ఇందులో కైరా అద్వాని కథానాయికగా నటిస్తోంది.
శ్రీమంతుడు వంటి విజయవంతమైన తరువాత కొరటాల, మహేష్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో.. ఈ సినిమా కోసం మహేష్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 27న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇదిలా ఉంటే...దీని తర్వాత మహేష్ తన 25వ సినిమాని వంశీ పైడిపల్లి డైరెక్షన్లో చేయనున్న సంగతి తెలిసిందే.
మహేష్ బాబు కెరీర్లో ఇది 25 వ సినిమా కాగా.. దేవీశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. వచ్చే ఫిబ్రవరి మొదటి వారం నుండి రెగ్యులర్ షూటింగ్ను ప్లాన్ చేస్తోంది చిత్రయూనిట్. అశ్వనీదత్, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని 2018 ఆగష్టుకు విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఒకే ఏడాదిలో మూడు నాలుగు నెలల గ్యాప్లో మహేష్ బాబు వరుస చిత్రాలు రానుండటంతో మహేష్ ఫ్యాన్స్కి పండగనే చెప్పాలి.