పవర్స్టార్ పవన్కళ్యాణ్ స్టామినా ఏంటో ఆయన తాజా చిత్రం అజ్ఞాతవాసి చెపుతోంది. పవన్ - త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తోన్న అజ్ఞాతవాసి ఈ నెల 10న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ అవుతోన్న సంగతి తెలిసిందే. వీరి కాంబోలో వచ్చిన జల్సా, అత్తారింటికి దారేది సినిమాలు సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో అజ్ఞాతవాసి ప్రి రిలీజ్ బిజినెస్ అదిరిపోయే రేంజ్లో జరుగుతోంది. తాజాగా అజ్ఞాతవాసి సినిమాకు U/A సర్టిఫికెట్ ఇచ్చారు.
పవన్ చివరి రెండు సినిమాలు సర్దార్ గబ్బర్సింగ్, కాటమరాయుడు రెండూ ఘోరమైన డిజాస్టర్లు అయ్యాయి. రెండు అట్టర్ ప్లాప్లు ఉన్నా కూడా అజ్ఞాతవాసికి కళ్లు చెదిరిపోయే రేంజ్లో ప్రి రిలీజ్ బిజినెస్ జరుగుతోంది. పవన్ స్టామినాకు తోడు త్రివిక్రమ్ మానియా కూడా ఉండడంతో ఈ సినిమాకు అన్ని ఏరియాల్లోను పవన్ పాత సినిమాలను మించి బిజినెస్ జరుగుతోంది. అజ్ఞాతవాసి నైజాం హక్కులు కళ్ళు చెదిరే స్థాయిలో రూ. 27 కోట్లకు అమ్ముడయ్యాయి.
ఈ ఏరియాలో బాహుబలి 2 తర్వాత ఇదే రెండో టాప్ రేటు. బాహుబలి 1 ఈ ఏరియాలో రూ.22 కోట్లకు అమ్ముడైంది. ఇప్పుడు ఈ సినిమా కంటే రూ.5 కోట్లకు అదనంగా ఈ సినిమా రైట్స్ పలికాయి. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై చినబాబు నిర్మించిన ఈ చిత్రం జనవరి 10న రిలీజ్ కానుంది. కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రి రిలీజ్ బిజినెస్లోనే దుమ్ము రేపుతోన్న ఈ సినిమా ఇంకెన్ని సంచలనాలు క్రియేట్ చేస్తుందో ? చూడాలి.