బాలీవుడ్ లో సినిమాలు వరుసగా బోల్తా పడుతున్నా ప్రయోగాలకు మాత్రం అస్సలు వెనకాడటం లేదు. తాజాగా ఆయన నటించిన కొత్త చిత్రం ... తన టైటిళ్లతోనే ఆకర్షించే దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి జీరో అనే టైటిల్ను ఫిక్స్ చేశారు. దీంతో కింగ్ ఖాన్కు ఇప్పుడు ఓ భారీ బ్లాక్ బస్టర్ తప్పనిసరి.
హీరో షారుక్ ఖాన్ జీరో అయ్యారు. ఏ విషయంలో అనుకుంటున్నారా? ఓ సినిమాకి సంబంధించి.. ఆయన జీరోగా కనిపించనున్నారు. ఆనంద్ ఎల్.రాయ్ దర్శకత్వంలో షారుక్ హీరోలు(ద్విపాత్రాభినయం)గా ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. కత్రినా కైఫ్, అనుష్క శర్మ హీరోయిన్స్గా నటిస్తున్న ఈ చిత్రానికి టైటిల్గా 'జీరో' ఖరారు చేశారు.
ఇక టీజర్లో ఓ పార్టీలోకి వచ్చిన షారూఖ్ స్టెప్పులేయటం ఫన్నీగా ఉంది. ఎప్పుడు ప్రేమకథలో అలరించిన షారుక్ ఖాన్ తొలిసారి ఓ ప్రయోగాత్మక చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో విచిత్ర సోదరులు సినిమాలో మాదిరిగా మరుగుజ్జుగా నటిస్తున్నారు. టీజర్లో పేర్కొన్న ప్రకారం వినోదాన్ని పంచే వ్యక్తిగా, ఎలాంటి బాదరబందీ లేని పాత్రలో కనిపించనున్నట్టు తేలిపోయింది.
అనుష్క శర్మ, కత్రినా కైఫ్లు ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు. డిసెంబర్ 21, 2018న చిత్రం విడుదల కానున్నట్లు ప్రకటించేశారు. గతేడాది షారూఖ్ నటించిన రయిస్, జబ్ హ్యారీ మెట్ సెజల్ చిత్రాలు, చివరకు గెస్ట్ రోల్ చేసిన సల్మాన్ ట్యూబ్లైట్ కూడా బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా మిగిలాయి.