దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి తర్వాత ఎలాంటి సినిమా తీస్తాడో ఆ అంచనాలను సైతం బ్రేక్ చేస్తూ అదిరిపోయే కాంబినేషన్ లో సినిమా చేస్తున్నాడు. మెగా నందమూరి మల్టీస్టారర్ గా సినిమా షురూ చేస్తున్నాడు రాజమౌళి. చరణ్, ఎన్.టి.ఆర్ మల్టీస్టారర్ గా సినిమా రాబోతుందని తెలుస్తుంది. ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో వస్తుందట.


ఇక ఈ సినిమా 2018 అక్టోబర్ లో మొదలు పెట్టనున్నాడని తెలుస్తుంది. ఇక ఈ సినిమాకు అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ సంక్రాంతికి రివీల్ చేస్తారట. ఎన్.టి.ఆర్, చరణ్ కాంబోలో మొదటిసారి కలిసి చేస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే కథ సిద్ధం కాగా త్వరలో అది పూర్తి చేస్తారట. ఇద్దరు హీరోలకు లైన్ మాత్రమే వినిపించి ఒప్పించారట.


ఫైనల్ కథ కూడా సిద్ధమయ్యాక ఫుల్ నరేషన్ చెప్పేసి ఇక అప్పుడే సినిమా అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ చేస్తారట. మొత్తానికి రాజమౌళి మెగా స్కెచ్చే వేశాడని తెలుస్తుంది. డివివి దానయ్య నిర్మించబోతున్న ఈ సినిమా బడ్జెట్ 150 కోట్ల దాకా ఉంటుందని తెలుస్తుంది. తెలుగు, తమిళ, హింది భాషల్లో వస్తున్న ఈ సినిమా గ్రాండియర్ గా రాబోతుంది.


2018 అక్టోబర్ లో మొదలు పెట్టి 2019 సమ్మర్ కల్లా రిలీజ్ చేయాలని చూస్తున్నారట. మరి ఈ క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. కచ్చితంగా మళ్లీ రాజమౌళి ఈ సినిమాతో బాహుబలి స్థాయి విజయాన్ని అందుకుంటాడని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: