నటి రకుల్ ప్రీత్ సింగ్ గురించి కొత్తగా పరిచయం అవసరంలేదు.వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో తెర్రంగేటం చేసిన రకుల్ చేసిన తన మొదటి చిత్రంతోనే నటిగా మంచి మార్కులు కొట్టేయడంతో పాటు ఆ సినిమా హిట్ టాక్ ని సొంతం చేసుకుంది.క్రమేణా మహేష్ బాబు,రామ్ చరణ్ తేజ్,జూ.యన్టీఆర్ లాంటి అగ్ర హీరోల సరసన నటించి టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా చలామణి అవుతుంది.కేరళ మినహా దాదాపు అన్ని దక్షిణాది సినిమాలలో నటిస్తూ హీరోయిన్ గా మంచి గుర్తింపు పొందింది.
మామూలుగా అయితే ఇంట గెలిచి రచ్చ గెలవాలి అంటారు.కానీ కొందరి విషయాల్లో ఇలా జరుగదు.రచ్చ గెలిచాకే ఇంట గెలుస్తారు,అలాంటి కోవకు చెందినదే రకుల్.అయితే ఈ అమ్మడు ఇంకా ఇంట గెలవలేదు.బాలీవుడ్ లో చేసిన తన మొదటి సినిమా యారియన్ రకుల్ కు పెద్దగా పేరును సంపాదించలేకపోయింది.తెలుగులో స్టార్ గా బిజీ అయినప్పటి నుండి బాలీవుడ్ వైపుకు కన్నెత్తి కూడా చూడలేదు.