పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న మూడో చిత్రం “అజ్ఞాతవాసి” మీద అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో అని ఇండస్ట్రీ వర్గాలు ఆసక్తితో ఎదురు చూస్తున్నాయి, ఇప్పటికే ప్రీ బిజినెస్ ఓ రేంజ్ లో జరిగింది. అలాగే ఈ సినిమాను యూఎస్ లో  ఏ తెలుగు సినిమా విడుదల అవని విధంగా చాలా స్క్రీన్ల పై రిలీజ్ చేస్తూ ఉండడం మరో విశేషం.

ఇంత భారీ హంగులతో రిలీజ్  అవుతున్న అజ్ఞాతవాసి సినిమాకి కొత్త టెన్షన్ మొదలయ్యింది ….ఇప్పటికే ఈ సినిమా “లార్గో వించ్” సినిమా కాపీ అని ఇప్పటికే పలు ఆరోపణలు వచ్చాయి...ఈ క్రమంలో "లార్గో వించ్" సినిమా రైట్స్ బాలీవుడ్ కు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ టి సిరీస్ దక్కించుకుంది. ఈ సందర్భంగా టి సిరీస్ సంస్థ అజ్ఞాతవాసి మీద వస్తున్న ఆరోపణలకు లీగల్ గా అడుగులు వేస్తున్నట్లు సమాచారం.

ఈ క్రమంలో  టి సిరీస్ సంస్థతో  పరిచయాలున్న  హీరో రానా  ని అజ్ఞాతవాసి నిర్మాత రంగంలో దింపినట్లు సమస్యను తెర వెనక నుండి పరిష్కరించుకునే విధంగా అడుగులు ముందుకు వేస్తున్నట్లు టాక్ కూడా ఉంది. ఈ సందర్భంగా దర్శకుడు త్రివిక్రమ్ కూడా ఓ  ఆఫర్ ను  సదరు నిర్మాత సంస్థకు ఇచ్చాడట 10 కోట్లు ఇస్తాం ..  ఏమీ మాట్లాడవద్దని రచ్చ చేయొద్దని చెప్పారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న మాట. అసలు సినిమా కాపియో కాదో విడుదలైతేగానీ తెలియదు. కానీ పది కోట్ల డీల్ మాత్రం ఇండస్ట్రీలో నుండి బాగా వినిపిస్తున్న మాట. 


మరింత సమాచారం తెలుసుకోండి: