ఈ మధ్య అమ్మాయిలు మరి పాశ్చ్యాత సంస్కృతి కి అలవాటు పడి పోతున్నారు. నోయిడాలోని అట్టా గ్రామంలో ఆదివారం రాత్రి ఈ ఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం.. ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న విశ్వనాథ్ సాహు (45), తన కుమార్తె పూజా సాహు (21) గదిలోకి వెళ్లాడు. అక్కడ కుమార్తె బాయ్‌ఫ్రెండ్‌ ధర్మేంద్ర (24)ను చూసి విస్తుపోయాడు. అతడితో గొడవ పడ్డాడు. ఈ క్రమంలోపట్టు తప్పి కిందపడి మరణించాడు.

ఆదివారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అందరూ నిద్రపోతుండడంతో పొరుగునే ఉండే ధర్మేంద్ర.. ప్రియురాలు పూజ గదిలోకి ప్రవేశించాడు. ఆ తర్వాత కాసేపటికి పూజ తండ్రి వాష్ రూముకు వెళ్లేందుకు లేవగా, కుమార్తె గదిలో ఎవరో ఉన్నట్టు గుర్తించాడు. అనుమానంతో గదిలోకి వెళ్లి చూడగా ధర్మేంద్ర కనిపించాడు. ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. ధర్మేంద్రను వెంటనే అక్కడి నుంచి వెళ్లాలని ఆదేశించాడు.

ఇది కాస్తా ముదిరి ఒకరిపై ఒకరు దాడి చేసుకునే వరకు వెళ్లింది. ఈ క్రమంలో మూడో అంతస్తు నుంచి కిందికి దిగుతూ పట్టు తప్పి కిందపడ్డాడు. తీవ్ర గాయాలపాలైన అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ విశ్వనాథ్ మృతి చెందాడు. విశ్వనాథ్ భార్య గాయత్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులుపూజను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న ధర్మేంద్ర కోసం గాలిస్తున్నారు. తండ్రి మరణించినా కుమార్తెలో కించిత్ కూడా పశ్చాత్తాపం కనిపించలేదని పోలీసులు తెలిపారు. ‘జరిగిందేదో జరిగిపోయింది’ అని ఆమె పేర్కొన్నట్టు పోలీసులు తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: