‘అజ్ఞాతవాసి’ ఫైనల్ రిజల్ట్ బయటకు రావడంతో ఇక ఇదే సంక్రాంతికి రాబోతున్న బాలకృష్ణ మూవీ ‘జై సింహా’ పై చర్చలు జరుగుతున్నాయి. రేపు విడుదల కాబోతున్న ఈమూవీ పై ఇప్పటి వరకు ఎటువంటి గొప్ప అంచనాలు లేవు. అయితే టాలీవుడ్ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఈసినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 27 కోట్ల కలక్షన్స్ వస్తే నిర్మాత కళ్యాణ్ గట్టెక్కిపోతాడు అన్న అభిప్రాయాన్ని వ్యక్త పరుస్తున్నారు.

 

బాలకృష్ణ సినిమాలకు బిసి సెంటర్లలో విపరీతమైన రెస్పాన్స్ ఉండటంతో పాటు బాలయ్య సినిమాలకు ఇప్పటికీ సీడెడ్ ప్రాంతంలో అత్యంత భారీ ఓపెనింగ్స్ వస్తాయి. దీనికితోడు రేపు శనివారం నుండి ప్రారంభం అవుతున్న సంక్రాంతి సెలెవుల హడావిడి సుమారు 5 రోజులు ఉండటంతో సంక్రాంతి పండుగ నేపధ్యంలో ‘జై సింహా’ గట్టెక్కిపోయే ఛాన్స్ ఉంది అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

 

దీనికితోడు బాలకృష్ణకు ఎప్పటి నుంచో కలిసివచ్చే సంక్రాంతి సెంటిమెంట్ కూడ ‘జై సింహా’ కు కలిసి వచ్చే అంశంగా మారింది. ‘అజ్ఞాతవాసి’ మ్యానియా గంటగంటకు తగ్గిపోతున్న నేపధ్యంలో బాలయ్య ఈ అవకాశాన్ని ఖచ్చితంగా ఉపయోగించుకుంటాడు అని అంటున్నారు.

 

ఇక ఈ సినిమాలో బాలకృష్ణ పక్కన మూడవసారి నటిస్తున్న నయనతార సెంటిమెంట్ తో పాటు ఆమె నటన ఈసినిమాకు ప్లస్ పాయింట్ గా మారుతుంది అని ఈమూవీ ఫైనల్ కాపీని చూసినవాళ్ళు చెపుతున్నారు. దీనికితోడు ఛానల్స్ ప్రసారం చేస్తున్న ఆడియో రేటింగ్స్ లో కూడ ‘జై సింహా’ పాటలకు మంచి రేటింగ్స్ వస్తున్న నేపధ్యంలో ‘అజ్ఞాతవాసి’ పరాజయం ‘జై సింహా’ కు అదృష్టంగా మారుతుందా ? అన్న అంచనాలతో ఉన్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: