వివాదలదర్శకుడు రాంగోపాల్ వర్మ 'అజ్ఞాతవాసి' పై స్పందించాడు. ఇప్పటికే ‘అజ్ఞాతవాసి’ పై పెరిగిపోతున్న నెగిటివ్ టాక్ ను చూసి తల పట్టుకుంటున్న పవన్ అభిమానులకు వర్మ ఈమూవీ పై చేసిన కామెంట్స్ మరింత అసహనాన్ని కలిగిస్తున్నాయి. ‘ఇప్పుడే మహేష్ కత్తి అజ్ఞాతవాసి రివ్యూ వీడియో  చూశాను చాలా బాగుంది. దేవుడి మీద ఒట్టు వేసి చెబుతున్నా పవన్ కల్యాణ్ కంటే మహేష్ కత్తే అందంగా ఉన్నాడు’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు.  

 ram gopal varma along with kathi mahesh photos కోసం చిత్ర ఫలితం

వర్మ తనను ప్రశంసించడంతో మహేష్ కత్తి వర్మకు ఈ వ్యవహారంలో 'థ్యాంక్స్' చెప్పడం లేటెస్ట్ ట్విస్ట్. వీరి ట్వీట్స్ ఇలా సాగిపోతుంటే మధ్యలో ఎంటర్ అయిన  హైపర్ ఆది వీరిద్దరినీ టార్గెట్ చేస్తూ మరో షాకింగ్ ట్విస్ట్ ఇచ్చాడు 'అదిగో తెల్ల కాకి అంటే ఇదిగో పిల్ల కాకి అన్నట్లుంది వీరిద్దరిని చూస్తుంటే' అని వ్యంగ్యాస్త్రం సంధించాడు.  

 ramgopal varma photos కోసం చిత్ర ఫలితం

ఇది ఇలా ఉండగా పవన్ కల్యాణ్ కోసం ఎంతకైనా సిద్దమనే అభిమానులు కూడా 'అజ్ఞాతవాసి’ పై విముఖత వ్యక్తం చేయడం షాకింగ్ న్యూస్ గా మారింది. దీనికితోడు ఈ సినిమా పై పడుతున్న సెటైర్స్ చూసి పవన్ ఫ్యాన్స్ విపరీతమైన అసహనానికిలోను అవుతున్నట్లు తెలుస్తోంది. రాజకీయాల్లో క్రియాశీలకంగా మారబోతున్న తరుణంలో పవన్ కు ఇలాంటి డిజాస్టర్‌ రావడంతో పవన్ ఇమేజ్ పై ఈ ఫెయిల్యూర్ ఏస్థాయిలో ప్రభావితం చేస్తుంది అన్న కోణంలో ప్రస్తుతం చర్చలు జరుగు తున్నాయి.

 సంబంధిత చిత్రం

ఇది ఇలా ఉండగా ‘అజ్ఞాతవాసి’ నిన్న ప్రపంచ వ్యాప్తంగా 44 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూల్ చేసిన నేపధ్యంతో ఈ సంక్రాంతి పండుగ హడావిడి ముగేసేసరికి కనీసం 100 కోట్ల కలెక్షన్స్ మార్కును కూడ అందుకోలేదేమో అన్న అనుమానాలు మరి కొందరు వ్యక్తం చేస్తున్నారు. దీనితో ఈమూవీని అత్యంత భారీ మొత్తాలకు కొనుకున్న బయ్యర్లకు కనీసం ౩౦ నుండి 40 శాతం వరకు నష్టాలు రావడం ఖాయం అని అంటున్నారు. ఏమైనా ‘అజ్ఞాతవాసి’ పవన్ అభిమానులకు ఒక పీడకలగా  మారింది అన్నది వాస్తవం..




మరింత సమాచారం తెలుసుకోండి: