నందమూరి బాలకృష్ణ క్రేజియస్ట్ ప్రాజెక్ట్ అయినా ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం మీద ఫుల్ ఫోకస్ పెట్టారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించి టీజర్ కోసం రామకృష్ణ స్టూడియోలో నలుగురు సభ్యుల మధ్య షూటింగ్ జరగడం పెద్ద చర్చకు దారితీసింది.
బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ సినిమా నిమిత్తం చాలా గోప్యంగా తెలివిగా వ్యవహరిస్తున్నారు.కేవలం టీజర్ కోసం సెట్లో… దర్శకుడు, కెమెరామెన్, బాలయ్య తప్ప ఎవరూ లేరట. నాలుగో వ్యక్తి ఉండకూడదు అని స్ట్రిక్ రూల్స్ పెట్టాడట బాలయ్య. ఆఖరికి సెల్ఫోన్లనీ తీసుకురానివ్వలేదని.. అంత పకడ్బందీగా షూటింగ్ సాగిందని తెలుస్తోంది. అయితే రెగ్యులర్ షూటింగ్ లో కూడా ఇటువంటి రూల్స్ అమలు చేయాలని ఉద్దేశంతో బాలకృష్ణ ఉన్నట్లు సమాచారం.
సినిమా విషయంలో ఏం జరుగుతుంది విడుదలయ్యేంత వరకూ బయట ప్రపంచానికి తెలియ కూడదని బాలకృష్ణ చాలా పగడ్బందీగా సన్నివేశాలు తీయాలని చిత్ర బృందానికి గట్టిగా చెప్పారట. ఈ టీజర్ లో ఎన్టీఆర్ గెటప్పులో ఉన్న బాలయ్యని చూపించరట. అన్నీ బ్యాక్ షాట్సే.