టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్స్ లో మాటల మాంత్రికులు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. ఈయనతో సినిమా అంటే పెద్ద హీరోలు పోటీ పడతారు..అయితే జనవరి 10న విడుదలైన ‘అజ్ఞాతవాసి’ సినిమా మిక్స్డ్ టాక్తో రన్ అవుతుంది. గతంలో పవన్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన జల్సా, అత్తారింటికి దారేది బాక్సాఫీస్ ని షేక్ చేశాయి. కానీ ‘అజ్ఞాతవాసి’ సినిమాపై వీరాభిమానులు సైతం పెదవి విరుస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమా త్రివిక్రమ్ రేంజ్ కాదని..ఒక పంచ్ డైలాగ్, కథనం సరిగా లేకపోవడం ఎన్నో లోపాలు ఎత్తి చూపిస్తున్నారు.
ఎన్నో అంచనాలు పెట్టుకు ‘అజ్ఞాతవాసి’ ఫ్యాన్స్ ని మాత్రం కాస్త ఇబ్బందులు పెట్టినట్టే కనిపిస్తుంది. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమా తీయబోతున్నారు. ‘అజ్ఞాతవాసి’ చిత్రం మిక్స్డ్ టాక్ వచ్చినా..మొదటి రోజు భారీ కలెక్షన్లను సాధించిన ఈ చిత్రం సంక్రాంతి ఊపును కొనసాగిస్తే మాత్రం సేఫ్ జోన్లోకి వెళ్లే అవకాశం ఉంది.
ఇక ఈ సినిమాపై వస్తున్న మిక్స్డ్ టాక్తో ఎన్టీఆర్ అభిమానులు ఆందోళన చెందుతున్నట్లుగా సోషల్ మీడియాలో వారు చేస్తున్నట్లు పోస్ట్లు చెబుతున్నాయి. ఇప్పటికే రెండు సంవత్సరాల నుంచి అపజయాలతో సతమతమవుతున్న పవన్ కళ్యాన్ కి త్రివిక్రమ్ మంచి బ్లాక్ బస్టర్ సినిమా అందిస్తారని అందరూ ఊహించారు. కానీ త్రివిక్రమే ఈ సినిమాకి మైనస్ అని, త్రివిక్రమ్ మార్క్ ఈ సినిమాలో ఫ్యాన్స్ ఆవేదన చెందుతున్నారు. ఇక ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ సినిమా షూటింగ్ ఆ మద్య హైదరాబాద్ లో అయ్యింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పవన్ కళ్యాన్ రావడం మరో విశేషం. కానీ ‘అజ్ఞాతవాసి’ సినిమా, రిజల్ట్ చూసిన ఎన్టీఆర్ అభిమానులు.. ‘మా హీరో చిత్రానికైనా మనసు పెట్టి చెయ్ మాంత్రికుడా..’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్లు చేస్తున్నారు. గత మూడు సంవత్సరాల నుంచి ఎన్టీఆర్ వరుస విజయాలతో దూసుకు పోతున్నారు..ఒకవేళ త్రివిక్రమ్ ఎన్టీఆర్ కి మంచి విజయం అందిస్తే..ఇద్దరూ టాప్ లోకి దూసుకు వెళ్తారు.