ప్రతి సంవత్సరం సంక్రాంతి రేస్ ఎవరి ఊహలకు అందని ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడ అదే జరిగినట్లు తెలుస్తోంది. బాలకృష్ణ నటించిన ‘జైసింహా’ కు సంబంధించి అమెరికాలో ప్రీమియర్ లు చూసిన ప్రేక్షకులు అదేవిధంగా ఈరోజు తెల్లవారుజామునుండి ఆంధ్రప్రదేశ్ లోని వివిధ ప్రాంతాలలో ప్రదర్శింపబడ్డ ‘జై సింహా’ స్పెషల్ షోలను చూసిన అభిమానులు ఈమూవీకి హిట్ టాక్ ను ఇవ్వడమే కాకుండా ‘అజ్ఞాతవాసి’ కన్నా ఈసినిమా పది రెట్లు బెటర్ అని తీర్పు ఇచ్చినట్లు వార్తలు అందుతున్నాయి.

 JAISIMHA MOVIE LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం

ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో నిన్న అర్దరాత్రి నుండి ఈమూవీ స్పెషల్ షోలు చాల చోట్ల పడుతున్నాయి. ఈషోలు చూసిన ప్రేక్షకులు చెపుతున్న అభిప్రాయం ప్రకారం ఈమూవీ ఫస్టాఫ్ సూపర్బ్ అన్న టాక్ వచ్చింది. ఇక ఇంటర్వెల్ ట్విస్ట్ అదిరిపోయింది అని కూడ అంటున్నారు. ఈమూవీ ఫస్టాఫ్ లో వచ్చే అమ్మకుట్టి సాంగ్ బ్రాహ్మణుల మీద చిత్రీకరించిన ఒక సీన్ హైలైట్ గా నిలుస్తుంది అని అంటున్నారు.

 JAISIMHA MOVIE LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం

ముఖ్యంగా తమిళనాడులోని కుంభకోణం ప్రాంతంలో దాదాపు 800 మంది బ్రాహ్మణుల మధ్య బాలయ్య చెప్పిన ఎమోషనల్ డైలాగ్స్ ఈమూవీకి హైలెట్ గా మారుతాయి అని అంటున్నారు. దీనికితోడు ఈమూవీలోని ఎమోషనల్ సీన్స్ కూడ బాగా రక్తికట్టడంతో ఫస్టాఫ్ కన్నా సెకండాఫ్ చాలాచాలా బాగుంది అన్న కామెంట్స్ వస్తున్నాయి.

 JAISIMHA MOVIE LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం

ఈమూవీ కథ కూడ చాలాబాగుంది అని ఓవర్సీస్ ప్రేక్షకులు కూడ చెపుతున్న నేపధ్యంలో  ఔట్&ఔట్ మాస్ సినిమాగా రూపొందిన ఈమూవీకి బీసీ సెంటర్స్ ఆడియెన్స్ కు ఎక్కువగా కనెక్ట్ అవుతారని ఈసినిమా చూసి బయటకు వస్తున్న సామాన్య ప్రేక్షకులు ఇస్తున్న కామెంట్స్. ఈటాక్ ఈరోజు సాయంత్రం వరకు ఇలాగే కొనసాగితే సంక్రాంతి రేస్ లో ‘జై సింహా’ విజేతగా మారి బాలకృష్ణ సంక్రాంతి సెంటిమెంట్ ను నిజం చేసినట్లు అవుతుంది..




మరింత సమాచారం తెలుసుకోండి: