జై సింహా’ – ‘అజ్ఞాతవాసి’ లు ఒకదాని పై ఒకటి పోటీగా విడుదలైన నేపధ్యంలో మెగా నందమూరి అభిమానుల మధ్య కలక్షన్స్ రికార్డుల విషయమై మాటల యుద్ధం ఉంటుంది అని భావించారు. అయితే అనుకోకుండా ఈ మాటల యుద్ధం తన రూట్ మార్చుకుని ఇప్పుడు మెగా నందమూరి అభిమానుల మధ్య ఫ్లెక్సీ వార్ గా మారింది.

 BALAKRISHNA ALONG WITH PAVAN LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం

టాప్ హీరోలు తాము అంతా ఒకటే అని అనేకసార్లు చెప్పినా ఆ విషయాలను టాప్ హీరోల అభిమానులు పట్టించుకోరు అన్న విషయం ఈ ఫ్లెక్సీ వార్ ద్వారా మరొకసారి రుజువైంది. పవన్ కళ్యాణ్ ‘అజ్ఞాతవాసి’ విడుదల సందర్భంగా పవన్ అభిమానులు విశాఖపట్నంలోని పవన్ ఇమేజ్ ను ఆకాశానికెత్తేస్తూ ఒక బ్యానర్ ఏర్పాటు చేశారు. 'తాతల చరిత్ర చెప్పుకునే అలవాటు లేదు.. మేము సృష్టించే చరిత్రలే భావితరాలకు భగవద్గీత' అని పేర్కొంటూ థియేటర్ వద్ద కొంతమంది అభిమానులు ఈ బ్యానర్ ను ఏర్పాటు చేశారు.

  మీకేముందిరా చరిత్ర?:

మెగా అభిమానులు చేసిన ఈ కామెంట్స్ పరోక్షంగా నందమూరి హీరోలపై చేసిన కామెంట్స్ గా ఫీల్ అయిన బాలకృష్ణ అభిమానులు మెగా అభిమానులకు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఈరోజు విడుదలైన ‘జై సింహా’ విడుదల సందర్భంగా అదే విశాఖలోని ఓ థియేటర్ వద్ద ఏర్పాటు చేసిన మరో ఫ్లెక్సీ పై వ్రాసిన వ్రాతలు సంచలనంగా మారాయి.

  నందమూరి ఫ్యాన్స్ కౌంటర్:

‘మాకు నాన్న, తాత చరిత్ర ఉంది కాబట్టి చెప్పుకుంటున్నాము. మీకేముందిరా చెప్పుకోవడానికి చరిత్ర ఒక మహానీయుని గురించి చెప్పితే అది చరిత్ర అవుతుంది. అదే మీ చరిత్ర చెప్పితే భావి తరాలకు కాదు కదా.. బావిలో దూకడానికి కూడా పనికిరాదు' అంటూ నందమూరి అభిమానులు మెగా అభిమానులకు కౌంటర్ ఇచ్చారు అని వార్తలు వస్తున్నాయి. ఈ ఫ్లేక్సీల వార్ మాటల యుద్ధంగా మారి విశాఖపట్టణంలో ఈ టాప్ హీరోల అభిమానుల మధ్య ఘర్షణ వాతావరణానికి తావిచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఇది ఇలా ఉంటే శ్రీకాకుళంలోని పురుషోత్తమపురంలో పవన్ కల్యాణ్, నందమూరి బాలకృష్ణ అభిమానుల మధ్య తలెత్తిన వివాదం ఘర్షణకు దారి తీసి చివరికి ఒకరిపై ఒకరు దాడిచేసుకునే వరకు వెళ్ళడమే కాకుండా ఒక దశలో బాలయ్య అభిమాని పవన్ అభిమాని పై బ్లేడ్ తో దాడి చేసాడు అన్న వార్తలు వస్తున్నాయి. మరి ఈ మెగా – నందమూరి వార్ మరిత పెరగకుండా ఉండటానికి ఆ ప్రాంతంలోని మెగా నందమూరి ఫ్యాన్స్ అసోసియేషన్ నాయకులు రంగంలోకి దిగి నష్ట నివారణ చర్యలు చేపడుతున్నాట్లు వార్తలు వినిపిస్తున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: