క్యూట్ బ్యూటీ సమంత అక్కినేని కుటుంబ కోడలుగా మారిన తరువాత తన వ్యవహార శైలిలో అదేవిధంగా తన డ్రెసింగ్ స్టైల్ లో చాలమార్పులు చేసుకుంది. అదేవిధంగా తానునటించే సినిమాల ఎంపిక విషయంలో కూడ చాలజాగ్రత్తలు అనుసరిస్తూ మంచిపాత్రలు అయితేనే తాను నటిస్తాను అంటూ సమంత తనవద్దకు వస్తున్న అనేకమంది దర్శక నిర్మాతలకు చెపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది ఇలా ఉండగా సమంత తన దైవ చింతనకు సంబంధించిన ఒక విషయాన్ని ఈమధ్య తన అభిమానులకు షేర్ చేసింది.

SAMANTHA LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం

ప్రస్తుతం తాను ఒప్పుకున్నా సినిమాలను పూర్తి చేస్తూ బిజీగా ఉంటున్న సమంత టైమ్ దొరికితే చర్చిలకు కూడ బాగా వెళుతుందట. గతంలో చెన్నైలో గడిపిన ఈభామ ప్రస్తుతం హైద్రాబాద్ లోనే ఉంటున్న సంగతి తెలిసిందే. మరి రెగ్యులర్ గా వెళ్లేందుకు ఒక చర్చిని ఎంచుకోవాలి కాబట్టి హైద్రాబాద్ లోని తిరుమలగిరిలో ఉన్న ఆల్ సెయింట్స్ చర్చిని తన ప్రార్ధనల కోసం ఎంచుకున్నదట సమంత.

 SAMANTHA LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం

ఈ చర్చికి తాను వారానికి మూడు సార్లు వెళతాను అంటూ సోషల్ మీడియా ద్వారా ఈవిషయాన్ని తన అభిమానులకు షేర్ చేసింది. అంతేకాదు ఆ చర్చి మెట్ల పై తాను నిలుచుని ఉన్న ఒక ఫోటోను కూడ షేర్ చేసింది సమంత. అయితే ఇలా చర్చికి రావడంపై తనకు గతంలో ఉన్న చిన్ననాటి కొన్ని జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయి అంటూ ఆ జ్ఞాపకాలను షేర్ చేసింది.

 SAMANTHA LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం

తన చిన్నప్పుడు తాను చర్చికి వెళ్లేందుకు పెద్దగా ఇష్టపడకపోతే తన తల్లి తనను బలవంతంగా లాక్కు వెళ్లేదని చెపుతోంది సామ్. 'అపుడు అమ్మ చెప్పినప్పుడు అర్ధం కాకపోయినా ఇపుడు మాత్రం మా అమ్మ చేసిన ప్రార్ధనల కారణంగానే నేను ఈ స్థాయిలో ఉండగలిగానని అర్ధమవుతోంది. మా అమ్మ ఓ అద్భుతం' అంటోంది ఈ అక్కినేని వారి కోడలు. ప్రస్తుతం సమంత నటిస్తున్న ‘రంగస్థలం’ మూవీ పై భారీ అంచనాలు ఉన్న నేపధ్యంలో ఈసినిమాలో ఆమె నటించిన పాత్రకు మంచి పేరుతో పాటు అవార్డులు వచ్చినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు.. 

 


మరింత సమాచారం తెలుసుకోండి: